భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి… 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు

తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 12:07 PM IST
భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి… 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు

తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.

తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు. రామనాథపురం జిల్లా కముది మండలం వల్లండై గ్రామంలో తిరుజ్ఞానం (60), అతని భార్య ముత్తురాక్కతో కలిసి ఉండేవాడు. అయితే తిరుజానం తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. గొడవ పడినప్పుడల్లా ఇంటి నుంచి బయటకు వెళ్లి నెల, రెండు నెలల తర్వాత తిరిగి వచ్చేవాడు. 

ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల క్రితం కూడా తిరుజ్ఞానం భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రెండు నెలలు ఎదురుచూసిన అతని భార్య…భర్త తిరిగి రాకపోవడంతో తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి ఆరా తీసింది. ఎక్కడ కూడా భర్త ఆచూకీ లభించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని అప్పటి నుంచి గాలిస్తున్న పోలీసులకు గత ఆదివారం వల్లలాం గ్రామ సమీపంలోని ఓ పాడుబడ్డ బావిలో ఎముకల గూడుగా మారిన వ్యక్తి మృతదేహం కనిపించింది.

పోలీసులు ఆ మృతదేహాన్ని వెలికి తీశారు. అతని చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా మృతుడు తొమ్మిది నెలల క్రితం భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన తిరుజ్ఞానంగా గుర్తించారు. దీంతో పోలీసులు తిరుజ్ఞానం అస్థిపంజరాన్ని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.