వైరల్ వీడియో: ఫైన్ వేశారనీ ఏడుస్తున్నయువకుడు..ఓదార్చిన పోలీసులు

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 08:37 AM IST
వైరల్ వీడియో: ఫైన్ వేశారనీ ఏడుస్తున్నయువకుడు..ఓదార్చిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ మిరాట్‌లోని బేగం బ్రిడ్జ్ దగ్గర పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయానికి ఓ యువకుడు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద రయ్ మంటూ దూసుకొచ్చేశాడు. అతడ్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఫైన్ వేశారు. ఫెనాల్డీ డబ్బులు కట్టామన్నారు.

దీంతో ఆ యువకుడు పోలీసులకు డబ్బులు ఇవ్వలేదు సరికదా..రోడ్డుపై నానా యాగీ చేశాడు. బైక్ ను కింద పడేశాడు. దాన్ని అటూ ఇటూ దొర్లించాడు. అటు తిప్పాడు..ఇటు తిప్పాడు. ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసుల ముందే తన బైకును కిందపడేసి.. అటూ ఇటూ దొర్లించాడు. ధ్వంసం చేయాలని చూశాడు. చివరికి అదే బైకు మీద ఏడుస్తూ కూర్చున్నాడు.

అది చూసిన అటుగా వెళ్తున్న వాహనదారులకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చుట్టూ గుమిగూడి చూస్తుండిపోయారు.  ట్రాఫిక్ పోలీసులు అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాక..అలా ఉండిపోయారు. కాసేపటికి ఓ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ అతడిని ఓదార్చేందుకు ట్రై చేశాడు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

కొత్త ట్రాఫిక్ రూల్స్ తో చలానాలు చెల్లించడం వాహనదారులకు భారంగా మారిందని..అందుకే..ఆ యువకుడు తన ఫ్రస్ట్రేషన్‌ను ఇలా చూపించాడని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం..హెల్మెట్ పెట్టుకుని ఉంటే  ఈ తిప్పలు ఉండేవి కాదు కదూ అంటూ సలహాలిస్తున్నారు.