BJP MP Rajveer singh : బీజేపీ ఎంపీని దోమలు కుట్టాయని రైలు ఆపేసిన అధికారులు

ఎంపీగారినే కాదు దోమలు మమ్మల్ని కూడా కుడుతున్నాయి..మంత్రిగారి విషయంలోనే కాదు మా ఫిర్యాదులపై కూడా అధికారులు ఇలాగే స్పందిస్తే బాగుటుందంటున్నారు ప్రయాణీకులు..

BJP MP Rajveer singh : బీజేపీ ఎంపీని దోమలు కుట్టాయని రైలు ఆపేసిన అధికారులు

BJP MP Rajveer Singh

BJP MP Rajveer singh : ఓ ఎంపీగారు రైలులో ప్రయాణిస్తున్నారు. ఆయన్ని దోమ కుట్టింది. రైలు సిబ్బందికి ఈ విషయం తెలిసింది. దీంతో రైలు ఆగింది. రైలు ఆపేసిన సిబ్బంది ఆదరాబాదరాగా ఎంపీగారి వద్దకొచ్చి బోగీ మొత్తం క్లీన్ చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికి రైలు తిరిగి బయలుదేరింది. ఎంపీగారినే కాదు సాధారణ ప్రయాణీకుల్ని కూడా రైల్లో దోమలు కుడుతుంటాయి. కానీ సిబ్బంది పట్టించుకుంటారా? అబ్బే అంత సీన్ ఉండదు. కానీ ఆయన ఎంపీగారు మరి..పైగా అధికార పార్టీ బీజేపీ ఎంపీ..అందుకే సిబ్బంది అంత హడావిడి చేశారు..

ఇంతకీ ఆ ఎంపీగారు ఎవరంటే..యూపీలోని ఇటా బీజేపీ ఎంపీ రాజ్‌వీర్‌ సింగ్‌. ఆయన ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న గోమతి ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీకోచ్ లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ వీర్ సింగ్ ని దోమలు కుట్టాయి. ఆయనకు నిద్రాభంగం కలిగింది. దీంతో ఆయన అనుచరుడు మాన్‌సింగ్‌ కు బాధేసింది. అయ్యో మాసార్ని దోమలు కుట్టాయి నిద్రాభంగం కలుగుతోందని ఫీల్ అయిపోయి ఆ విషయాన్ని ట్విట్టర్‌లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ‘ఎంపీ గారిని దోమలు కుడుతున్నాయి. టాయిలెట్‌ అధ్వానంగా ఉంది.’ అని ట్వీట్‌ చేశారు.

అంతే రైల్వే అధికారులు ఆగమేఘాలమీద స్పందించారు. ఉన్నావ్‌ స్టేషన్‌లో రైలు ఆపి ఎంపీగా ప్రయాణించే బోగీ మొత్తం దగ్గరుండి మరీ శుభ్రం చేయించారు. స్ర్పే చేశారు. ఆ తర్వాతే రైలు కదిలింది. ఇలా మంత్రిగారి విషయంలోనే కాదు మా ఫిర్యాదులపై కూడా అధికారులు ఇలాగే స్పందిస్తే బాగుటుందంటున్నారు ప్రయాణీకులు..