నెటిజన్ కామెంట్ కి అదిరిపోయే రిప్లై ఇచ్చిన సుష్మాస్వరాజ్
ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఒక్క ట్వీట్ చేసి సాయం కోరితే వెంటనే స్పందించే నాయకుల జాబితాలో కేంద్రవిదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎప్పుడూ ఫస్ట్ ఫ్లేస్ లో ఉంటారు. ఎలాంటి సందేహాలున్నా వెంటనే తీరుస్తారు.అలాంటి సుష్మాకు ఓ వ్యక్తి ట్వీట్ చేస్తూ.. ‘మేడమ్.. మీరు మా విదేశాంగ మంత్రి అనుకున్నాం. బీజేపీలో ఉన్న ఏకైక తెలివైన వ్యక్తి మీరే అనుకున్నాం. అలాంటప్పుడు ఎందుకు మీ ముందు చౌకీదార్ అని పెట్టుకున్నారు?’ అని ప్రశ్నించారు.
దీనికి జవాబుగా…ఎందుకంటే నేను భారతీయ ప్రజల ఆసక్తులకు, విదేశాల్లో ఉంటున్న భారతీయులకు చౌకీదార్ (కాపలాదారు)ని కాబట్టి’ అని సుష్మా ట్వీట్ చేశారు.దీంతో సమిత్ అనే నెటిజన్ ఓ కామెంట్ చేశాడు. ‘ఈ ట్వీట్లన్నీ చేస్తోంది సుష్మా స్వరాజ్ కాదు. ఆమె ఇస్తున్న జీతానికి పీఆర్ చేస్తున్న పని ఇది..’ అని తెలిపాడు. దీనిపై సుష్మా స్పందిస్తూ…ఎలాంటి సందేహం లేదు.. ట్వీట్లు చేస్తోంది నేనే. దెయ్యం కాదు అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. దీంతో ఈ ట్వీట్కు విపరీతమైన స్పందన వస్తోంది. పదివేల మందికిపైగా లైక్ చేశారు. సుష్మాకు మంచి హాస్యచతురత ఉందంటూ ఆమెను పొగుడుతున్నారు.