Attack On Doctor: వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్

కరోనా సోకిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందటంతో అతడి బంధువులు జూనియర్ డాక్టర్ పై దాడి చేశారు. ఈ ఘటన అసోం రాష్ట్రం హోజాయ్‌ జిల్లాలోని ఓడాలి మోడల్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో జరిగింది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు.

Attack On Doctor: వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్

Attack On Doctor

Attack On Doctor: కరోనా సోకిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందటంతో అతడి బంధువులు జూనియర్ డాక్టర్ పై దాడి చేశారు. ఈ ఘటన అసోం రాష్ట్రం హోజాయ్‌ జిల్లాలోని ఓడాలి మోడల్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో జరిగింది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో రోగి బంధువులు జూనియర్ డాక్టర్ కుమార్‌ సేనాపతిపై దాడిచేశారు.

ఈ దాడిలో కుమార్‌ సేనాపతికి తీవ్రగాయాలయ్యాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు మొత్తం 24 మందిని అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. ఇది అనాగరిక చర్యగా అభివర్ణించిన ఆయన.. ఫ్రంట్‌లైన్ కార్మికులపై దాడులను సహించబోమని స్పష్టం చేశారు.

కాగా దాడికి గురైన యువ డాక్టర్ కుమార్‌ సేనాపతి ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తి చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు వెళ్లారు. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఓడాలి మోడల్‌ కొవిడ్‌ ఆసుపత్రికి వచ్చారు. ఇక ఈ దాడిని ఐఎంఏ ఖండించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.