దక్షిణేశ్వర్ మెట్రో ట్రయిల్ రన్ విజయవంతం

దక్షిణేశ్వర్ మెట్రో ట్రయిల్ రన్ విజయవంతం

​ Kolkata’s Dakshineswar Metro దక్షిణేశ్వర్ లోని కాళీ మాత ఆలయం వరకు నిర్మించిన కోల్ కతా మెట్రో రైలు తొలి ట్రయల్ రన్ ​ను బుధవారం(డిసెంబర్-23,2020) భారతీయ రైల్వే విజయవంతంగా నిర్వహించింది. నోపరా నుంచి దక్షిణేశ్వర్​ వరకు 4 కిలోమీటర్లు మేర ఈ ట్రయల్​ రన్​ చేపట్టారు అధికారులు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ ట్వీట్​ చేశారు.

ఈ మెట్రో రైలు పూర్తయితే లక్షల మంది రోజువారి ప్రయాణికులకు మేలు జరుగుతుందని వివరించారు. అంతేకాక దక్షిణేశ్వర్​ కాళీ మాత దేవాలయానికి వచ్చే భక్తులు తేలిగ్గా ఆలయానికి చేరుకోవచ్చని వెల్లడించారు.

నోపరా నుంచి కవి సుభాశ్ స్టేషన్​ వరకు నిర్మిస్తున్న రైల్వే మార్గం మొత్తం 27.22 కిలోమీటర్లు ఉండగా.. అందులో 15.70 కిలోమీటర్లు భూగర్భం మార్గం(అండర్ గ్రౌండ్ వే) ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైల్వే మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.