దక్షిణేశ్వర్ మెట్రో ట్రయిల్ రన్ విజయవంతం
Kolkata’s Dakshineswar Metro దక్షిణేశ్వర్ లోని కాళీ మాత ఆలయం వరకు నిర్మించిన కోల్ కతా మెట్రో రైలు తొలి ట్రయల్ రన్ ను బుధవారం(డిసెంబర్-23,2020) భారతీయ రైల్వే విజయవంతంగా నిర్వహించింది. నోపరా నుంచి దక్షిణేశ్వర్ వరకు 4 కిలోమీటర్లు మేర ఈ ట్రయల్ రన్ చేపట్టారు అధికారులు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
ఈ మెట్రో రైలు పూర్తయితే లక్షల మంది రోజువారి ప్రయాణికులకు మేలు జరుగుతుందని వివరించారు. అంతేకాక దక్షిణేశ్వర్ కాళీ మాత దేవాలయానికి వచ్చే భక్తులు తేలిగ్గా ఆలయానికి చేరుకోవచ్చని వెల్లడించారు.
నోపరా నుంచి కవి సుభాశ్ స్టేషన్ వరకు నిర్మిస్తున్న రైల్వే మార్గం మొత్తం 27.22 కిలోమీటర్లు ఉండగా.. అందులో 15.70 కిలోమీటర్లు భూగర్భం మార్గం(అండర్ గ్రౌండ్ వే) ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైల్వే మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
Railways conducts 1st trial run of Metro train up to Dakshineswar, along Kolkata’s North-South corridor in West Bengal.
Once ready, this will enhance connectivity, benefit lakhs of daily commuters & enable devotees to comfortable visit Dakshineswar Kali Temple. pic.twitter.com/GxCAJCvFX4
— Piyush Goyal (@PiyushGoyal) December 23, 2020