కరోనా ఉన్నా అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే

  • Published By: venkaiahnaidu ,Published On : June 19, 2020 / 10:04 AM IST
కరోనా ఉన్నా అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని మొత్తం 18 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం (జూన్-19) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కరోనా సోకిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఓటు.. ఓ వ్యక్తిని గద్దె ఎక్కించాలన్నా, దించాలన్నా ఉపయోగపడే ఆయుధం. అందుకే భారత్​లో ఎక్కడైనా ఓటింగ్​కు ప్రాముఖ్యం ఎక్కువే. తనకు ఇచ్చిన హోమ్​ క్వారంటైన్​ గడువు ముగియకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఎమ్మెల్యే అసెంబ్లీకి  వచ్చారు. అయితే అసెంబ్లీకి  వచ్చేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకొని పీపీఈ కిట్ ధరించారు.

మధ్యప్రదేశ్​లో 3 రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఓ కాంగ్రెస్​ ఎమ్మెల్యేకు ఇటీవల కరోనా పాజిటివ్​ వచ్చింది. హోమ్​ క్వారంటైన్​లో ఉన్న ఆయన.. రాజ్యసభకు అభ్యర్థులను ఎన్నుకునేందుకు భోపాల్​ అసెంబ్లీ వచ్చారు. పీపీఈ కిట్​ ధరించి వచ్చి, ఓటు వేసిన తక్షణమే వెళ్లిపోయారు. వెంటనే అక్కడి సిబ్బంది మొత్తం అసెంబ్లీని శానిటైజ్​ చేశారు.

Read:  అంబులెన్స్ లో స్ట్రెచర్‌పై వచ్చి ఓటేసిన ఎమ్మెల్యే