Sonu Sood: స్పెషల్ ఒలింపిక్స్.. భారత్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్!

కరోనా మహమ్మారి మనుషులపై దండెత్తితే మనుషులలో కొందరు వారి గొప్ప మనసు చాటుకొని మహానుభావులయ్యారు. అందులో సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి సోనూసూద్ కు తాజాగా అరుదైన గౌరవం లభించింది.

Sonu Sood: స్పెషల్ ఒలింపిక్స్.. భారత్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్!

Sonu Sood

Sonu Sood: కరోనా మహమ్మారి మనుషులపై దండెత్తితే మనుషులలో కొందరు వారి గొప్ప మనసు చాటుకొని మహానుభావులయ్యారు. అందులో సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలలో విలన్ పాత్రలలో నటించే సోనూసూద్.. కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎవరికి ఏం సాయం కావాలన్నా ఆదుకొని ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు.

అలాంటి సోనూసూద్ కు తాజాగా అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది రష్యాలో జరిగనున్న స్పెషల్ ఒలింపిక్స్ లో భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ఎంపికయ్యారు. రష్యాలోని కజాన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 22 నుంచి వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ వింటర్ ఒలింపిక్స్ కు హాజరయ్యే ఇండియన్ అథ్లెట్ల బృందానికి సోనూసూద్ నాయకత్వం వహించనున్నారు.

స్పెషల్ ఒలింపిక్స్‌కు ఇండియా అథ్లెట్లు చేస్తున్న ప్రయాణంలో తాను భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పిన సోనూ.. ఈ కుటుంబంలో చేరడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ని మరింత పెద్దదిగా చేస్తానని సోనూసూద్ వాగ్దానం చేశారు. కాగా, అథ్లెట్లు దీనికి ‘స్పెషల్ ఒలింపిక్స్ ఆసియా పసిఫిక్ రీజియన్ ఇనిషియేటివ్‌’ అని ఇప్పటికే పేరు కూడా పెట్టారు.