COVID care facilities: కొవిడ్‌పై పోరాటంలో కదిలొస్తున్న కార్పొరేట్ సంస్థలు

కోవిడ్‌ కంట్రోల్, ట్రీట్మెంట్‌లో కార్పొరేట్‌ సంస్థలను భాగస్వాములను చేయడానికి స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో పలు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయి.

COVID care facilities: కొవిడ్‌పై పోరాటంలో కదిలొస్తున్న కార్పొరేట్ సంస్థలు

Covid care facilities

COVID care facilities: కోవిడ్‌ కంట్రోల్, ట్రీట్మెంట్‌లో కార్పొరేట్‌ సంస్థలను భాగస్వాములను చేయడానికి స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో పలు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయి.

కరోనా కంట్రోల్ కోసం అందించే వైద్య సంబంధిత సేవలకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్‌) ఫండ్‌ నిధులను వినియోగించుకోవడానికి కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ పర్మిషన్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్‌ కంపెనీలు సీఎస్‌ఆర్‌లో భాగంగా వైద్య సేవల్లో పాలు పంచుకోవడానికి ఏపీ ఎకనావిుక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఏపీఈడీబీ) ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.

ఆక్సిజన్‌ యూనిట్ల నిర్వహణ కూడా..
జిల్లాల వారీగా కోవిడ్‌ చికిత్స కోసం అవసరమైన ఆక్సిజన్, కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, బెడ్లు వంటి అన్ని వివరాలను ఏపీఈడీబీ సేకరిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఆక్సిజన్‌ యూనిట్లు ఏర్పాటు చేసి.. వాటి నిర్వహణను కూడా ఆయా కంపెనీలకే అప్పగించనుంది.

ఈ మేరకు ప్రస్తుత సంక్షోభంలో కంపెనీలు సామాజిక బాధ్యతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని ఈడీబీ.. ఇప్పటివరకు 500కు పైగా కంపెనీలకు లేఖలు రాయగా పలు కంపెనీలు ముందుకొచ్చాయి.

మరికొన్ని కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఏషియన్‌ పెయింట్స్, కాల్గోట్‌ పామాయిల్, డీఆర్‌డీవో, జిందాల్‌ స్టీల్, దాల్మియా సిమెంట్స్, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌), అర్జాస్‌ స్టీల్, ఆర్‌వీఆర్‌ ప్రాజెక్ట్స్ వంటి అనేక సంస్థలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఈ కంపెనీలు 200కు పైగా ఆక్సిజన్‌ సిలిండర్లను రాష్ట్రానికి అందించగా, మరో 100 సిలిండర్లను త్వరలో అందించనున్నాయి.

కార్పొరేట్‌ సాయం ఎలా చేస్తారంటే..
జిందాల్‌ స్టీల్‌: ఒడిశాలోని అంగుల్‌ జిల్లా ఫ్యాక్టరీ నుంచి ఏపీకి ట్యాంకర్‌ ద్వారా ఏప్రిల్‌ 24 నుంచి ప్రతి రోజూ 20 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. ఆక్సిజన్‌ కొరత తీరే వరకు సరఫరా చేస్తామని కంపెనీ మేనేజ్మెంట్ హామీ ఇచ్చింది.

విశాఖ స్టీల్‌: విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్‌ చికిత్స కోసం ఆక్సిజన్‌తో కూడిన 50 బెడ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తోంది. క్రమంగా పెంచుకుంటూ.. మే 15 నాటికి అదనంగా మరో 150, మే 30 నాటికి 250, జూన్‌ నాటికి 600 పడకలు అందుబాటులోకి తెచ్చే విధంగా విశాఖ స్టీల్‌ ప్లాన్ సిద్ధం చేసింది.

డీఆర్‌డీవో: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 100 ఆక్సిజన్‌ సిలిండర్లను అందించడంతోపాటు అనంతపురం జిల్లాలో ఒక ఆక్సిజన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.

ఏషియన్‌ పెయింట్స్‌: 50 ఆక్సిజన్‌ సిలిండర్లను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అందజేసింది.

ఆర్‌వీఆర్‌ ప్రాజెక్ట్స్: 50 ఆక్సిజన్‌ సిలిండర్లను అందించింది

ఓయో: కోవిడ్‌ నియంత్రణలో ముందుండి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ విశ్రాంతి కోసం ఉచితంగా తమ హోటల్‌ గదులను వినియోగించుకోవడానికి అనుమతించింది.