Covid Tests In Airports : మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ.. విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో మూడు బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలోని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Covid Tests In Airports : మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ.. విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు

Covid tests

Covid Tests In Airports : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో మూడు బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలోని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నేటి నుంచి ర్యాండమ్ గా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఇవాళ కేంద్రం పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. సమావేశం అనంతరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చైనా సహా వివిధ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ర్యాండమ్ గా శాంపిల్స్ ను సేకరించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చైనాలో కరోనా కేసుల పెరుగుదలకు బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కారణమని అధికార వర్గాలు తెలిపాయి.

BF-7 Omicron Variant : భారత్ లోకి ప్రవేశించిన బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్.. గుజరాత్, ఒడిశాలో కేసులు గుర్తింపు

ఇప్పటివరకు భారత్ లో మూడు కేసులు నమోదు అయ్యాయి. అక్టోబర్ లో గుజరాత్ లో గుర్తించగా ఇప్పటివరకు గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక కేసు నమోదు అయింది. వేరియంట్ కు ఇంక్యుబేషన్ చాలా తక్కువ అని అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ కరోనా ముప్పు ఇంకా ముగియలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నిఘా పెంచాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దేశంలో అర్హత కలిగిన జనాభాలో 27 నుంచి 28 శాతం మంది మాత్రమే కరోనా బూస్టర్ డోస్ తీసుకున్నారని.. మిగిలిన వారందరూ తీసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యులు డా.వీకే పాల్ కోరారు. ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించాలని వీకే పాల్ సూచించారు.