Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలోని నాసిక్ లో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్ – ఔరంగాబాద్ రహదారిపై నందూర్నాక వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు బస్సు మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా మృతిచెందినట్లు సమాచారం. ఈ ప్రమాదాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమోల్ తాంబే ధృవీకరించారు. ఈ బస్సు యవత్మాల్ నుంచి ముంబై వెళ్తోంది.

Minister Amit Shah: పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లపై నిఘా పెట్టంటి.. బీఎస్‌ఎఫ్‌కు అమిత్ షా ఆదేశం

ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 4:20 గంటల సమయంలో జరిగింది. కంటైనర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగినట్లు తెలిసింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. తెల్లవారు జామున కావటంతో ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెల్లవారు జామున సమయంలో బస్సు వేరే వాహనాన్ని ఢీకొట్టింది. ఈ విషయాన్ని గమనించేలోపే బస్సులో మంటలు చెలరేగాయి. కిటికీలోంచి దూకి నా ప్రాణాన్ని కాపాడుకున్నానని ఓ ప్రయాణికుడు తెలిపాడు. క్షణాల్లోనే బస్సులో మంటలు వ్యాపించాయని అన్నాడు. ప్రమాదం జరిగిన ఇరవై నిమిషాల తర్వాత అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుందని బస్సు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు స్థానిక మీడియాతో పేర్కొన్నాడు.