Crime News: మణిపూర్‌ తరహా ఘటన.. రాజస్థాన్‌లో యువతిని నగ్నంగా ఊరేగించి, వీడియోలు తీసి..

రక్షించాలంటూ బాధిత మహిళ కేకలు వేసినప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు. దీనిపై కేసు నమోదు..

Crime News: మణిపూర్‌ తరహా ఘటన.. రాజస్థాన్‌లో యువతిని నగ్నంగా ఊరేగించి, వీడియోలు తీసి..

Crime News

Crime News – Rajasthan : మణిపూర్‌(Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన నుంచి దేశం తేరుకోకముందే రాజస్థాన్ లోనూ అటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో, పిహార్ లో ఓ గిరిజన యువతి(21)పై దాడి చేసి, నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఆ సమయంలో వీడియో కూడా తీశారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ మహిళపై ఆమె భర్త, అతడి సోదరులే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రక్షించాలంటూ బాధిత మహిళ కేకలు వేసినప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుండడంతోనే ఆమె భర్త దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధిత యువతి వేరే గ్రామంలో ఉన్న సమయంలో ఆమెను అత్తింటి వారు కిడ్నాప్ చేసి సొంత గ్రామానికి తీసుకువచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

ఈ ఘటనను ఖండిస్తున్నానని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. నేరస్థులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పారు. యువతిని నగ్నంగా ఊరేగించిన ఘటనపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Russia: అణ్వాయుధ సామర్థ్యమున్న క్షిపణులను మోహరించి కలకలం రేపుతున్న రష్యా