Husband Letter : నా భార్యే నాకు అంత్యక్రియలు చేయాలి..నేను చనిపోయినా ఎప్పుడూ నీతోనే ఉంటా..

ఆత్మహత్య చేసుకుంటూ ఓ భర్త భార్యకు రాసిన లేఖ: .‘నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నిన్ను ఎంతో సంతోషంగా చూసుకోవాలనుకున్నా..కానీ ఈ సమాజంలో పెళ్లి చేసుకున్నా..విడదీసి నిన్ను నానుండి దూరం చేసారు..నీకు దూరంగా నేను జీవించలేను..నేను మరణించినా నీతోనే ఉంటాను..మన బిడ్డను నువ్వు కనాలి..నువ్వే నాకు అంత్యక్రియలు చేయాలి’అని రాసి ఉన్న లేఖ పలువుని కంటతడిపెట్టిస్తోంది.

Husband Letter : నా భార్యే నాకు అంత్యక్రియలు చేయాలి..నేను చనిపోయినా ఎప్పుడూ నీతోనే ఉంటా..

Up Man Letter Written To Pregnant Wife

Uttar Pradesh man letter written to pregnant wife : మతాంతర వివాహాలు చేసుకున్న జంట ఎన్ని కష్టాలు..ఎన్ని అవమానాలు..ఎన్ని సూటీపోటీ మాటలు భరించాలో ఓ యువకుడు చనిపోతూ రాసిన ఓ లేఖ చూస్తే అర్థం అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతితో సంతోషంగా జీవించాలనే ఆశతో వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ యువకుడు బంధువుల ఈటెల్లాంటి మాటలకు మానసికంగా కృంగిపోయి గర్భంతో ఉన్న భార్యను వదిలి ఆత్మహత్య చేసుకుంటూ రాసిన ఓ లేఖ కంటతడి పెట్టిస్తోంది. ‘నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నిన్ను ఎంతో సంతోషంగా చూసుకోవాలనుకున్నా..కానీ ఈ సమాజంలో పెళ్లి చేసుకున్నా..విడదీసి నిన్ను నానుండి దూరం చేసారు..నీకు దూరంగా నేను జీవించలేను..నేను మరణించినా నీతోనే ఉంటాను..మన బిడ్డను నువ్వు కనాలి..నువ్వే నాకు అంత్యక్రియలు చేయాలి’ అంటూ సూసైడ్ నోటు రాసి చనిపోయిన ఓ యువకుడి దీనగాథ ఇది.

యూపీలో ఓ యువకుడు ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాడు. తరువాత కూడా ఆ జంట బంధువులు..ఇరుగుపొరుగువారు..తెలిసినవాళ్లు మాట్లాడే ఈటెల్లాంటి మాటలతో మానసికంగా కృంగిపోయారు. ఈక్రమంలోనే ఆమె గర్భందాల్చింది. కానీ మతంకాని వ్యక్తిని వివాహం చేసుకుందని యువతి తల్లిదండ్రులు ఆమెను తమతో తీసుకువెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో భార్యకు దూరమైన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య గర్భవతి అని తెలిసి కూడా, పుట్టబోయే బిడ్డను కూడా చూడకుండా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ స్టేషన్‌కు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో దొరికిన సూసైడ్ నోట్ అక్కడున్నవారినే కాదు పోలీసులను కూడా భావోద్వేగానికి గురి చేసింది.

ఈ లేఖలో..`నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా భార్య పేరు ‘మరియం బానో’.నా భార్య ప్రస్తుతం ఆమె తన తండ్రి మహ్మద్ అజాద్ ఇంటిలో ఉంది. నా మృతదేహాన్ని ఆమెకే అప్పగించండి. ఆమే నా అంత్యక్రియలు చేయాలి. నాకేం జరిగిందో.. నేనెందుకు చనిపోయానో నా భార్యే చెబుతుంది. `మరియం.. ఐ లవ్యూ…నేను చనిపోయినా ఎప్పుడూ నీతోనే ఉంటా…నీ హృదంలోను..మన ప్రేమకు ప్రతిరూపమైన బిడ్డను నువ్వు కనాలి. ఆ బిడ్డలో నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను..నువ్వు మరో వివాహం చేసుకోవద్దు’ అనిరాసి ఉంది.

చనిపోయిన వ్యక్తి ఛతర్ పూర్ నివాసి భూపేంద్ర యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. అతను ఆత్మహత్యను బంధువులకు సమాచారం అందించారు. మతాంతర వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడం వల్లే భూపేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఎదిగిన కొడుకు చనిపోవటంతో భూపేంద్రర్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.