గోవాలోకి నో ఎంట్రీ
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5 లో అమలు చేయాల్సిన మార్గదర్శకాలను,తాజా సడలింపులను శనివారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులు తమ రాష్ట్రంలో అమలు చేస్తాం కానీ… అంతర్ రాష్ట్ర రవాణాకు అనుమతించేది లేదని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.
అంతర్రాష్ట్ర రవాణాకు సంబంధించి ఇకపై ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, దీనిపై తమ రాష్ట్రంలో పరిస్థితుల మేరకు నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో గోవా సీఎం తాజా నిర్ణయం తీసుకున్నారు.
All relaxations that have been allowed by Central govt will be allowed in Goa, other decisions regarding the relaxations will be taken in a Cabinet meeting later today. We are not allowing inter state transport: Chief Minister Pramod Sawant #Unlock1 pic.twitter.com/SrxkKZQvKH
— ANI (@ANI) June 1, 2020
Read: ఒక్క విద్యార్థిని పరీక్షల కోసం…70సీట్ల బోటు నడిపిన కేరళ