ఎవరీ సుభాష్ చంద్ర గార్గ్.. సీఎం జగన్ ఆయననే ఎందుకు సెలెక్ట్ చేశారు

  • Published By: veegamteam ,Published On : March 2, 2020 / 06:19 AM IST
ఎవరీ సుభాష్ చంద్ర గార్గ్.. సీఎం జగన్ ఆయననే ఎందుకు సెలెక్ట్ చేశారు

ఏపీ సీఎం జగన్ మరో సలహాదారుని నియమించుకున్నారు. సీఎంకు ఆర్ధిక సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ప్రభుత్వం గార్గ్ ను నియమించింది. సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం ఆర్థిక సలహాదారుగా అపాయింట్ అయిన సుభాష్ చంద్ర గార్గ్ గురించి అంతా ఆరా తీస్తున్నారు. అసలు ఎవరీ గార్గ్? సీఎం జగన్ ఏరికోరి మరీ ఆయననే ఎందుకు అపాయింట్ చేశారు? గార్గ్ అనుభవం ఏంటి? సీఎం జగన్ నమ్మకాన్ని ఆయన నిలుపుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

* సుభాష్ చంద్ర గార్గ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
* రాజస్థాన్‌ కేడర్-1983 బ్యాచ్ అధికారి
* ఇటీవలే వీఆర్ఎస్(voluntary retirement scheme) తీసుకున్నారు
* వీఆర్ఎస్ తీసుకున్న కొన్ని నెలలకే సీఎం జగన్ ఆర్థిక సలహాదారుగా నియామకం
* ప్రధాని మోడీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికశాఖ, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పని చేశారు
* ఎర్లీగానే రిటైర్మెంట్ తీసుకున్నారు

* 2019లో జులైలో కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత రిటైర్మెంట్
* ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా పని చేశారు
* నోట్ల రద్దు నిర్ణయంలో కీ రోల్
* విద్యుత్ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు
* బదిలీకి ముందే వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న గార్గ్
* ఆర్థిక సంస్కరణలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన గార్గ్
* బడ్జెట్ రూపకల్పనలో గార్గ్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు

* సార్వభౌమ బాండ్లను విక్రయించడం ద్వారా 10 బిలియన్ డాలర్లను సేకరించొచ్చని బడ్జెట్ లో వచ్చిన ప్రతిపాదనను సూచించింది గార్గ్
* ఈ ప్రతిపాదనను ఆర్బీఐ మాజీ గవర్నర్ సహా పలువురు మేధావులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు
* బిమల్ జలన్ ప్యానెల్ సభ్యులతో విభేదాలు
* వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వెంటనే.. ఆమోదించాలని కోరిన గార్గ్

సీఎం జగన్ కు ఇప్పటికే అనేక మంది సలహాదారులు ఉన్నారు. మీడియాతో పాటు అనేక రంగాల్లో అడ్వైజర్లను నియమించుకున్నారు. ఇప్పుడు ఇంకో సలహాదారు వచ్చారు. మరో అడ్వైజర్ తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెబుతున్నారు. రాష్ట్ర ఆదాయ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు… ప్రభుత్వం.. పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ సమయంలో ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవడం చాలా అవసరం.

See Also | గాలివారి పెళ్లి కంటే ఘనంగా: ఖర్చు రూ.600కోట్లు!
 
ఆ కసరత్తులో భాగంగానే సీఎం జగన్ ఈ తాజా నియామకం చేసినట్టు అర్థమవుతోంది. ఈ కొత్త సలహాదారు నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. గతంలో గార్గ్ చేసిన పదవులు, ఆయన అనుభవం.. నిధుల సమీకరణకు ఉపయోగపడుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. మరి సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని గార్గ్ ఏ మేరకు నిలుపుకుంటారో చూడాలి.