Woman Cuts Tongue : బాబోయ్.. స్టాలిన్ గెలిచాడని.. నాలుక కోసుకుంది
నాయకుల మీద, పార్టీలపైన అభిమానం ఉండటంలో తప్పు లేదు. ఎనలేని ప్రేమ చూపించడం నేరం కాదు. అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటూ ఉంటారు. కొందరు రక్త దానం చేసి అభిమానం చాటుకుంటారు. మరికొందరు అన్నదానం చేస్తారు. ఇంకొందరు పాలాభిషేకాలు చేస్తారు. కానీ, ఆ మహిళా అభిమాని ఏం చేసిందో తెలుసా.. ఏకంగా కోసేసుకుంది.
Woman Cuts Off Her Tongue : సినీ, రాజకీయ నాయకుల మీద, పార్టీలపైన అభిమానం ఉండటంలో తప్పు లేదు. ఎనలేని ప్రేమ చూపించడం నేరమూ కాదు. అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటూ ఉంటారు. కొందరు రక్త దానం చేస్తే, మరికొందరు అన్నదానం చేస్తారు. ఇంకొందరు పాలాభిషేకాలు చేసి అభిమానం చాటుకుంటారు. కానీ, తమిళనాడులో అలా కాదు. ప్రజలు చచ్చిపోయేంత అభిమానం చూపిస్తారు. తమిళుల అభిమానం మామూలుగా ఉండదు. తాజాగా ఇది మరోసారి ప్రూవ్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించి పదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండడంతో ఓ మహిళా అభిమాని చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ఏకంగా నాలుకే కోసేసుకుంది. ఎందుకిలా చేశావమ్మా అంటే.. మొక్కు తీర్చుకున్నాని చెబుతోంది.
తమిళనాడుకు చెందిన వనిత(32)కు డీఎంకే పార్టీ అంటే గౌరవం. స్టాలిన్ నాయకత్వమంటే అభిమానం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలవాలని, స్టాలిన్ సీఎం అవ్వాలని ఆమె మొక్కుకుంది. ఇప్పుడు ఆమె కోరిక నెరవేరింది. డీఎంకే సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని చేపట్టబోతోంది. దీంతో వనిత తన మొక్కును తీర్చుకుంది.
స్థానికంగా ఉన్న ముత్తాలమ్మన్ ఆలయానికి వనతి వెళ్లింది. కరోనా నేపథ్యంలో ఆలయం మూసివేసి ఉండడంతో గేటు బయట నిల్చుని తన నాలుక కోసుకుంది. తెగిన నాలుకను అమ్మవారికి నైవేద్యంగా గేటు బయట పెట్టేసి వెళ్లిపోయింది. అలా మొక్కు సమర్పించి స్టాలిన్ పట్ల ఉన్న అభిమానాన్ని చూపింది. కానీ నాలుక కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
ఏంటమ్మా ఇదంతా అంటే.. డీఎంకే గెలవాలని.. గెలిస్తే తన నాలుక కోసుకుంటానని ముత్తాలమ్మన్ అమ్మవారికి మొక్కుకున్నట్లు వనిత తెలిపింది. ఆమె అభిమానం నెటిజన్లను విస్తుపోయేలా చేసింది. ఇదెక్కడి అభిమానం రా నాయనా అని అంతా నాలుక కరుచుకున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకునేంత వెర్రి అభిమానం ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.