Etawah : పెళ్లిలో విషాదం, చనిపోయిన పెళ్లి కుమార్తె, శవాన్ని పక్కనే ఉంచి వివాహం

పెళ్లి కుమార్తె హఠాన్మరణం చెందింది. దీంతో అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానీ పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడికి చనిపోయిన పెళ్లి కూతురి చెల్లెలితో వివాహం జరిపించడం విశేషం. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా జిల్లాలో చోటు చేసుకుంది.

Etawah : పెళ్లిలో విషాదం, చనిపోయిన పెళ్లి కుమార్తె, శవాన్ని పక్కనే ఉంచి వివాహం

Bride

Wedding Ceremony : పెళ్లి..అందరూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అతిథులతో పండుగ వాతావరణం నెలకొంది. భాజా భజంత్రీలు మోగుతున్నాయి. కానీ..అంతలోనే తీవ్ర విషాదం. పెళ్లి కుమార్తె హఠాన్మరణం చెందింది. దీంతో అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానీ పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడికి చనిపోయిన పెళ్లి కూతురి చెల్లెలితో వివాహం జరిపించడం విశేషం. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా జిల్లాలో చోటు చేసుకుంది.

మంజేష్ అనే వ్యక్తికి..సురభి అనే యువతితో వివాహం నిశ్చయించారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సురభి మెడలో తాళి కట్టాల్సి ఉంది. వారి వారి సాంప్రదాయ ప్రకారం వివాహం జరుగుతోంది. అకస్మాత్తుగా పెళ్లి కుమార్తె సురభి కుప్పకూలిపోయింది. ఏమి జరిగిందో అర్థం కాలేదు.

స్థానికంగా ఉన్న వైద్యులను పిలిపించారు. పెళ్లి మండపంలోనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు..షాకింగ్ న్యూస్ చెప్పారు. సురభి ఇక లేదని, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. దీంతో వధువు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే..పెళ్లి మండపంలో వరుడికి మృతురాలు చెల్లెలు నిషాతో వివాహం జరిపించారు. సురభి మృతదేహాన్ని పక్క గదిలో ఉంచి..వివాహ తంతును పూర్తి చేయించారు.

Read More : Corona Lockdown : జూన్ 1 నుంచి ఉదయం 10గంటల నుంచే కర్ఫ్యూ.. చిత్తూరు జిల్లాలో మరింత కఠినంగా ఆంక్షలు