పవన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్ అనడం సరికాదన్నారు.

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 10:51 AM IST
పవన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్ అనడం సరికాదన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్ అనడం సరికాదన్నారు. రెండు డెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్ అవుతాయా అని ప్రశ్నించారు. ప్రజా నాయకుడు అని చెప్పుకుని మాట్లాడేది ఇలాగేనా అని ప్రశ్నించారు. దిశ ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే పవన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు. మహిళ రక్షణ కోసం కొత్త ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు.

మతమార్పిడులపై పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్స్‌ని ఖండించారు మంత్రి సుచరిత. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని.. ఎవరికి ఇష్టమైన దేవుళ్లను వాళ్లు పూజించుకునే స్వేచ్ఛ మన దేశంలో ఉందన్నారు. ఎవరూ ఎవరిని బలవంతంగా మతం మార్చాలేరని చెప్పారు. అలాగే 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న తమకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.