బ్రేకింగ్ : 9మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు(డిసెంబర్ 17,2019) సస్పెన్షన్ల పర్వం నడిచింది. అసెంబ్లీ నుంచి 9మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు వారిని

  • Published By: veegamteam ,Published On : December 17, 2019 / 11:54 AM IST
బ్రేకింగ్ : 9మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు(డిసెంబర్ 17,2019) సస్పెన్షన్ల పర్వం నడిచింది. అసెంబ్లీ నుంచి 9మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు వారిని

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు(డిసెంబర్ 17,2019) సస్పెన్షన్ల పర్వం నడిచింది. అసెంబ్లీ నుంచి 9మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు వారిని సస్పెండ్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సభలో రగడ జరిగింది. అమరావతిలో భూ యజమానుల పేర్లను మంత్రి బుగ్గన సభలో బయటపెట్టారు. టీడీపీ నేతలు, చంద్రబాబు మనుషులు రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో భూములు కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన ఆరోపించారు.

దీనికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ చెప్పినా వినిపించుకోలేదు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో 9మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని.

సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు:
నిమ్మల రామానాయుడు
అచ్చెన్నాయుడు
వెలగపూడి రామకృష్ణబాబు
మద్దాల గిరి
అనగాని సత్యప్రసాద్
బెంగాళం అశోక్
వీరాంజనేయ స్వామి
ఏలూరి సాంబశివరావు
గద్దె రామ్మోహన్ రావు