TTD Caution Deposit Money : కాషన్ డిపాజిట్ డబ్బులపై టీటీడీ కీలక ప్రకటన.. అవాస్తవాలను నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి
కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాషన్ డిపాజిట్ సొమ్మును భక్తుల ఖాతాల్లోకి పంపుతున్నామని తెలియజేసింది. ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేసిన ఎమ్మెల్సీ బీటెక్ రవిపై టీటీడీ అధికారులు సోమవారం తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
TTD Caution Deposit Money : కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాషన్ డిపాజిట్ సొమ్మును భక్తుల ఖాతాల్లోకి పంపుతున్నామని తెలియజేసింది. ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేసిన ఎమ్మెల్సీ బీటెక్ రవిపై టీటీడీ అధికారులు సోమవారం తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కరెంట్ బుకింగ్, ఆన్లైన్ బుకింగ్ విధానంలో గదులు బుక్ చేసుకుంటారు. భక్తులు గదులు ఖాళీ చేసిన తరువాతి రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు కాషన్ డిపాజిట్ రీఫండ్ ఎలిజిబిలిటి స్టేట్మెంట్ను అధీకృత బ్యాంకులైన ఫెడరల్ బ్యాంకు లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంకులకు పంపుతారు. ఈ బ్యాంకుల అధికారులు అదే రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు (బ్యాంకు పనిదినాల్లో) సంబంధిత మర్చంట్ సర్వీసెస్కు పంపుతారు. మర్చంట్ సర్వీసెస్ మరుసటి రోజు కస్టమర్ బ్యాంక్ ఖాతాకు పంపుతారు.
కస్టమర్ బ్యాంక్ సంబంధిత అమౌంట్ కన్ఫర్మేషన్ మెసేజ్ (ఏఆర్ నెంబర్)ను, సొమ్మును సంబంధిత భక్తుల అకౌంట్కు పంపుతారు. కస్టమర్ బ్యాంకు వారు భక్తుల అకౌంట్కు సొమ్ము చెల్లించడంలో జాప్యం జరుగుతోందని టీటీడీ గుర్తించింది. ఒకవేళ భక్తులు యాత్రికుల సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్, ఈ-మెయిల్ ద్వారా సమస్యను టీటీడీ దృష్టికి తీసుకొచ్చిన పక్షంలో పై వివరాలతో సంబంధిత బ్యాంకుల్లో విచారణ చేయాలని భక్తులకు సూచించడం జరుగుతోంది.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 7 బ్యాంకు పనిదినాల్లో కాషన్ డిపాజిట్ రీఫండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జులై 11 నుండి 4, 5 రోజుల్లో రీఫండ్ చేరే విధంగా టీటీడీ యుపీఐ విధానంలో రీఫండ్ చేయడం జరుగుతోంది. దీనివల్ల నేరుగా భక్తుల అకౌంట్కే రీఫండ్ సొమ్ము చెల్లించడం జరుగుతోంది.
ఇదిలా ఉండగా కొందరు వ్యక్తులు పనిగట్టుకుని కాషన్ డిపాజిట్కు సంబంధించి టీటీడీపై దుష్ప్రచారం చేయడం మంచిది కాదని అధికారులు హితవు పలికారు. వాస్తవంగా కాషన్ డిపాజిట్ సొమ్ము నేరుగా భక్తుల ఖాతాలకే చేరుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ వినియోగించుకుంటున్నాయని ఆరోపించడం శోచనీయం అన్నారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.