ఇంగ్లాండ్‌ను తిప్పేసిన భారత్.. 10వికెట్ల తేడాతో విజయం

ఇంగ్లాండ్‌ను తిప్పేసిన భారత్.. 10వికెట్ల తేడాతో విజయం

పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. వికెట్‌ నష్టపోకుండా 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది భారత జట్టు. భారత్‌ భోజన విరామ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 11 పరుగులు చేయగా.. తర్వాత రోహిత్ శర్మ మెరుపులు కారణంగా 7.4ఓవర్లలోనే టార్గెట్‌ని ఫినిష్ చేసింది. రోహిత్ శర్మ 25పరుగులు, గిల్ 15పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

అంతుకుముంతు ఇంగ్లండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. దీంతో 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లలో స్టోక్స్‌ 25 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిస్తే.. రూట్‌ 19 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 5 వికట్లు, అశ్విన్‌ 4, సుందర్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

అంతుకుముందు మొదటి రోజు అక్షర్ పటేల్ చేసిన అద్భుతమైన బౌలింగ్ ముందు, ఇంగ్లీష్ జట్టు కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది.. తొలి రోజు ఆట ముగిసే వరకు 3 వికెట్ల నష్టంతో భారత్ 99 పరుగులు చేసింది. రెండవ రోజు, మొదటి సెషన్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 145 పరుగులకు కట్టడి చేసింది ఇంగ్లాండ్ జట్టు. తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగా భారత్‌ ఇంగ్లండ్‌పై 33 పరుగుల ఆధిక్యంలో ఉంది.

మ్యాచ్ మొదటి రోజు, టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోగా.. భారత్ తరఫున 100 వ టెస్ట్ మ్యాచ్ ఆడిన ఇషాంత్ తొలి వికెట్ సాధించాడు. దీని తరువాత అక్షర్ పటేల్, అశ్విన్ కలిసి 9 వికెట్లు తీశారు. తన రెండవ టెస్ట్ ఆడుతున్న అక్షర్ మొదటి ఇన్నింగ్స్‌లో 38 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో అశ్విన్ 26 పరుగులు ఇచ్చి 3వికెట్లు సాధించాడు.

రెండో రోజు భారత్‌ ఓపెనర్‌ షుబ్‌మన్‌ గిల్‌ వికెట్‌ను 33 పరుగుల వద్ద కోల్పోయింది. అతను 11 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తర్వాత చేతేశ్వర్ పుజారా ఖాతా తెరవకుండా జాక్ లీచ్ బౌలింగ్‌లో Lbw అయ్యాడు. 27 పరుగులతో బ్యాటింగ్ చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా లీచ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె జాక్ లీచ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్.. ఫస్ట్ ఓవర్.. ఫస్ట్ బాల్‌కే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జాక్ క్రాలీ అవుట్ అయ్యాడు. ఫస్ట్ ఓవర్ మూడవ బంతికే అక్షర్ చేతిలో బెయిర్ స్టో వికెట్ కోల్పోయింది. పరుగులేమీ లేకుండానే ఇంగ్లాండ్ రెండు వికెట్లను కోల్పోయింది. తర్వాత ఏ మాత్రం కుదురుకోలేక 81పరుగులకే ఆలౌట్ అయ్యింది.