Ind vs Eng: సిరీస్ కోసం ఫైనల్ ఫైట్.. గెలిచేదెవరు
సిరీస్ ఫైట్కు టీమిండియా - ఇంగ్లాండ్ రెడీ అయ్యాయి. ఇండియా - ఇంగ్లీష్ టీమ్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరగనుంది. సుదీర్ఘ ఫార్మాట్లో సత్తాచాటి.. పొట్టి క్రికెట్లో రెండు సిరీస్ విజయాలు సాధించిన టీమిండియా..
Ind vs Eng: సిరీస్ ఫైట్కు టీమిండియా – ఇంగ్లాండ్ రెడీ అయ్యాయి. ఇండియా – ఇంగ్లీష్ టీమ్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరగనుంది. సుదీర్ఘ ఫార్మాట్లో సత్తాచాటి.. పొట్టి క్రికెట్లో రెండు సిరీస్ విజయాలు సాధించిన టీమ్ఇండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ నెగ్గగా.. ఇవాళ జరగనున్న లాస్ట్ ఫైట్లో భారత్, ఇంగ్లాండ్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి.
మరోమారు బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ సిద్ధంగా ఉండటంతో రికార్డులు తిరగరాసేందుకు రెండు జట్ల ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. పరుగుల వరద పారుతున్న ఎమ్సీఏ మైదానంలో భారత్ జోరు కనబరిచి ముచ్చటగా.. మూడో సిరీస్ కొడుతుందా..? లేక ఇంగ్లాండ్ హిట్టర్లు మరోసారి దంచి కొట్టి సిరీస్ను ఎగరేసుకుపోతారా అనేది సస్పెన్స్గా మారింది.
ఈ సిరీస్లోని రెండు మ్యాచ్ల్లోనూ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మంచి స్కోర్లే చేసినా.. ఫ్లాట్ పిచ్ కావడంతో మరింత భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. తొలి వన్డేలో దుమ్మురేపిన ధావన్ అదే జోరు కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటుంటే.. రోహిత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.
గత రెండు మ్యాచ్ల్లోనూ అర్ధశతకాలు సాధించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి అభిమానులు సెంచరీ ఆశిస్తున్నారు. మరోవైపు గత మ్యాచ్లో రికార్డు స్కోరును ఛేదించిన ఇంగ్లండ్ జట్టు అదే ఊపులో సిరీస్ కొట్టేయాలని చూస్తోంది.