MS Dhoni : అలర్ట్.. ‘రాంచీలో ఇరుక్కుపోయిన ధోని.. ఇంటికెళ్లేందుకు రూ.600 కావాలట..’ ఈ మెసేజ్ మీకు వచ్చిందా?
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని పేరుతో మోసానికి ప్రయత్నించినట్లు వివరించాడు.
MS Dhoni Stuck In Ranchi : ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ఆన్లైన్లో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యూజర్ చేసిన పోస్ట్ చూస్తే దిమ్మ దిరగక మానదు. ఈ సారి ఏకంగా టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని పేరుతో మోసానికి ప్రయత్నించినట్లు వివరించాడు.
ఏం జరిగిందంటే..?
mahi77i2 ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఓ వ్యక్తికి మెసేజ్ వచ్చింది. అది ధోని పంపినట్లుగా ఉంది. “నేను ఎంఎస్ దోనిని. నా ప్రైవేటు అకౌంట్ నుంచి మెసేజ్ చేస్తున్నాను. నేను రాంచీ పట్టణం బయటకు వచ్చాను. పర్స్ తెచ్చుకోవడం మరిచిపోయాను. ఫోన్ పే ద్వారా ఓ 600 రూపాయలు పంపించండి. వాటి సాయంతో నేను బస్సు ఎక్కి వెళతాను. ఇంటికి వెళ్లగానే మీ డబ్బును మీకు తిరిగి పంపుతాను.” అంటూ మెసేజ్ చేశారు
Guy Whittall : జింబాబ్వే మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. రక్షించిన పెంపుడు కుక్క..
నిజంగానే ధోని పంపించాడు అని నమ్మేలా ఓ సెల్పీని సైతం పంపడం గమనార్హం. అంతేనా చెన్నై సూపర్ కింగ్స్ నినాదమైన విజిల్ పోడు ని ఉపయోగించాడు.
ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ యూజర్ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. ఇప్పటికే ఈ పోస్ట్ను 200,000 మందికి పైగా వీక్షించారు.
ఆన్లైన్లో ఇలాంటి మోసాలు ఇటీవలకాలంలో ఎక్కువ అవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు ఇలాంటి మెసేజ్ వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలియని వారికి ఎలాంటి సందర్భాల్లోనైనా డబ్బులు పంప రాదని చెబుతున్నారు. మీకు వచ్చిన మెసేజ్ అకౌంట్ ను ఒకటికి రెండు సార్లు ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు.
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ అంబాసిడర్గా జమైకా చిరుత ఉసేన్ బోల్ట్..
ఇదిలా ఉంటే.. ధోని ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన చెన్నై జట్టు నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) April 25, 2024