IPL 2022: కోహ్లీ రికార్డుకు 4పరుగుల దూరంలో రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేయడానికి కేవలం 4పరుగుల దూరంలో మాత్రమే..

IPL 2022: కోహ్లీ రికార్డుకు 4పరుగుల దూరంలో రోహిత్ శర్మ

Rohit Sharma

IPL 2022: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేయడానికి కేవలం 4పరుగుల దూరంలో మాత్రమే నిలిచాడు. ఆదివారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ తర్వాత రోహిత్ ఇంకా సాధించాల్సింది 4పరుగులే.

ఢిల్లీ క్యాపిటల్స్ పై విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ 913 పరుగులు నమోదు చేయగా.. 910పరుగులు నమోదు చేశాడు రోహిత్ శర్మ. ఇంకా నాలుగు పరుగులు చేస్తే.. విరాట్ రికార్డ్ బ్రేక్ చేసినట్లే.

ఐపీఎల్ టోర్నమెంట్లో 900 ఫోర్ బౌండరీలు కంప్లీట్ చేయడానికి 5 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. అలా చేస్తే రోహిత్ 900ఫోర్లు కంప్లీట్ చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. మరో వైపు 6సిక్సులు బాదితే ముంబై ఇండియన్స్ తరపున 200 సిక్సులు పూర్తి చేస్తాడు. ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఇంకొక్క సిక్సు బాదితే 250 పూర్తి చేసినట్లు అవుతుంది.

Read Also: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ రికార్డులు

ఐపీఎల్ -2022 సీజన్ -15లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. ముంబై నిర్దేశించిన 178 పరుగుల భారీ టార్గెట్ ను మరో 10 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ ఆరంభంలో తడబడినా.. ఆఖర్లో పుంజుకుని విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్ 18.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.