ధోనీపై సెహ్వాగ్ ఫైర్.. అంపైర్‌ అంటే గౌరవం లేదా..

ధోనీపై సెహ్వాగ్ ఫైర్.. అంపైర్‌ అంటే గౌరవం లేదా..

టీమిండియా మాజీ కెప్టెన్.. సూపర్ కింగ్స్ కెప్టెన్.. మిస్టర్ కూల్‌పై విమర్శల దాడి జరుగుతూనే ఉంది. ఈ సారి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఏప్రిల్ 11 గురువారం రాత్రి జరగిన చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌లో ధోనీ అలా అంపైర్‌పై కోపం చూపించడం ఏ మాత్రం సబబు కాదంటూ దుమ్మెత్తిపోశాడు. 

భారత జాతీయ జట్టు తరపున ఆడుతున్న సమయంలో ధోనీ ఎప్పుడూ ఇంత ఎమోషనల్‌గా ప్రవర్తించలేదు. అతనికి టీమిండియా కంటే.. చెన్నై టీమ్‌పైనే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోంది. ధోనీ చేసిన తప్పిదానికి బీసీసీఐ ఇప్పటికే అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. 

ఇంత పెద్ద తప్పు చేసినప్పటికి చిన్న జరిమానాతో బయటపడిపోయాడు. ఈ విషయాన్ని తేలికగా వదిలేస్తే.. తర్వాత ఇంకో కెప్టెన్ ఇదే తప్పిదానికి  పాల్పడే అవకాశాలు ఉన్నాయి. అలా చేస్తూ పెోతే అంపైర్లకి విలువ ఉండకుండా పోతుంది. ధోనీపై నిషేధం విధిస్తే అందరికీ తెలిసి వచ్చేది. అలా మైదానంలోకి వెళ్లాల్సిన అవసరమేముంది. బౌండరీ లైన్ వెలుపల ఫోర్త్ అంపైర్ అందుబాటులో ఉన్నాడు. మరోవైపు పిచ్ వద్ద ఇద్దరు చెన్నై బ్యాట్స్‌మెన్‌లు చర్చిస్తున్నారు. మరి ఎందుకు ధోనీ వెళ్లినట్లు..?’ అని సెహ్వాగ్ మండిపడ్డాడు. 

నోబాల్ విషయమై అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్న సమయంలో అవుటై చెన్నై జట్టు డగౌట్‌లో కూర్చున్న ధోనీ.. నిబంధనల్ని అతిక్రమించి మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఈ తీరుపై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లతో పాటు భారత మాజీ క్రికెటర్లు కూడా ధోనీ తీరుని తప్పుబట్టారు.