Abdullapurmet Love Affair : ఫ్రెండ్‌ను చంపి గుండె తీసి ఫొటో పంపిన సైకో.. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉన్నాడని దారుణం

ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసేశాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. అంటూ పెదాలు కోసేశాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది.. అంటూ నవీన్‌ గుండెను కోసి ఆ ఫొటోను కూడా పంపించాడు. మర్మాంగాన్ని కూడా కోసేశాడు.

Abdullapurmet Love Affair : ఫ్రెండ్‌ను చంపి గుండె తీసి ఫొటో పంపిన సైకో.. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉన్నాడని దారుణం

Abdullapurmet Love Affair : సైకో లవర్ పై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిందితుడు హరిహర కృష్ణపై సెక్షన్ 302, 201, ఎస్టీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మూసారాంబాగ్ కి చెందిన నిందితుడు హరిహర కృష్ణ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. నవీన్ ను తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు.

మరోవైపు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ ముందు గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. నవీన్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో తన  స్నేహితుడు నవీన్ ను హరిహర కృష్ణ దారుణంగా హత్య చేశాడు. మహత్మా గాంధీ వర్సిటీలో ఇద్దరూ చదువుతున్నారు. ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించడంతో వివాదం నెలకొంది.

Also Read..Nandyala : కాపురానికి వెళ్లడం లేదని కూతురును హత్య చేసిన తండ్రి

ఈ నెల 17న పార్టీ చేసుకుందాం అని పిలిచి నవీన్ ను కిరాతకంగా హత్య చేశాడు హరిహర కృష్ణ. తాను ప్రేమించిన అమ్మాయితో నవీన్ చనువుగా ఉండటాన్ని కృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని, ప్రేమించిన అమ్మాయి తనకు ఎక్కడ దూరం అవుతుందోనని నవీన్ ను దారుణంగా మర్డర్ చేశాడు. హత్య తర్వాత ప్రియురాలికి మేసేజ్ కూడా పంపాడు.

అసలేం జరిగింది..?
ఈ నెల 17న నవీన్‌ను దారుణ హత్య చేశాడు కృష్ణ. అనంతరం అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని గుట్టల్లో పడేశాడు. ఈ నెల 17న పార్టీ చేసుకుందామని తన స్నేహితుడి రూమ్‌ కు నవీన్‌ను హరి ఆహ్వానించాడు. హరి పిలవడంతో నవీన్ వెళ్లాడు. పార్టీలో అమ్మాయి గురించి ఇద్దరికీ గొడవ జరిగింది. ఈ విషయాన్ని నవీన్ తన తండ్రి శంకరయ్యకి ఫోన్ చేసి చెప్పాడు. శంకరయ్య ఇద్దరితో మాట్లాడి గొడవను ఆపారు. అప్పటి నుంచి నాలుగు రోజులైనా నవీన్‌ కనిపించ లేదు. ఇంటికి రాలేదు, కాలేజీకీ వెళ్లలేదు. దాంతో కంగారుపడిన తల్లిదండ్రులు నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Also Read..Missed Call: 11 ఏళ్ల బాలిక మర్డర్ కేసులో నిందితుల్ని పట్టించిన మిస్డ్ కాల్

గుండెను బయటకు తీసి.. మర్మాంగాన్ని కోసి నవీన్ దారుణ హత్య కేసు విచారణలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలను పోలీసులు తెలుసుకున్నారు. నవీన్‌ ను దారుణంగా హత్య చేసిన తర్వాత హరి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా.. హరి లొంగిపోయాడు.

హరిహర కృష్ణ ఒక సైకో అని పోలీసులు చెబుతున్నారు. నవీన్‌ ను కిరాతకంగా హత్య చేశాక ఈ విషయాన్ని ప్రేమించిన అమ్మాయికి కృష్ణ ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయికి పంపిన మేసేజ్ దారుణంగా ఉంది. ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసి ఆ ఫొటో అమ్మాయికి పంపాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. అంటూ పెదాలు కోసేశాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది.. అంటూ నవీన్‌ గుండెను కోసి ఆ ఫొటోను కూడా పంపించాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా పడేశాడు. ఆ తర్వాత నవీన్ మర్మాంగాన్ని కూడా కోసేశాడు.

ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరమవుతుందోనని కిరాతకం..
నవీన్, కృష్ణ ఒకే కాలేజీలో చదువుతున్నారు. మంచి స్నేహితులు. అయితే, ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయం కృష్ణకు తెలిసింది. తాను ప్రేమించిన అమ్మాయి తనకు ఎక్కడ దూరం అవుతుందోనని కృష్ణకు అనుమానం మొదలైంది. అంతే, ఫ్రెండ్ హత్యకు ప్లాన్ చేశాడు. పార్టీ పేరుతో పిలిచి అత్యంత దారుణంగా చంపేశాడు. అంతేకాదు అతడి శరీర భాగాలను బయటకు తీసి వాటి ఫొటోలు అమ్మాయికి పంపాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో జరిగిన ఈ దారుణం షాక్ కి గురి చేసింది.

నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌ కాలేజీలో.. నాగర్‌కర్నూల్‌ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్‌ నవీన్‌ బీటెక్‌ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న హరితో నవీన్‌కు స్నేహం ఉంది. వీరిద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. దాంతో వివాదం మొదలైంది. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. నవీన్ వల్ల తనకు అమ్మాయి దక్కదేమోనని హరి భావించాడు. నవీన్ ను లేపేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ నెల 17న పార్టీ పేరుతో నవీన్ ను పిలిపించి మర్డర్ చేశాడు.

అమ్మాయి విషయంలో గొడవ జరిగిందని, ఆమె తనకు దక్కదని భావించి నవీన్‌ను హత్య చేసినట్లు కృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారులోని హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పడేసినట్లు చెప్పాడు.