Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు ప్లాన్ .. 16మంది అరెస్ట్

హైదరాబద్ లో మరోసారి ఉగ్రకదలికలను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్నారనే సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 16మందిని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు ప్లాన్ .. 16మంది అరెస్ట్

Hyderabad anti terrorist squad

Hyderabad : హైదరాబద్ లో మరోసారి ఉగ్రకదలికలను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్నారనే సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 16మందిని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ భూపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ నుంచి ఐదుగురు అరెస్టు చేశారు యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్.

కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో హైదరాబాద్లో తనిఖీలు హైదరాబాద్ లో పోలీసులతో కలిసి మధ్యప్రదేశ్ అధికారులు భారీ ఆపరేషనర్ నిర్వహించారు. అలా అనుమానాస్పందగా ఉన్న మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకుంది ఏటీఎస్. నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 18 నెలల నుంచి హైదరాబాద్ లో నిందితులు మకాం వేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సమాచారం. దీంతో అధికారులు అనుమానుతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.