IIIT Basara Students Protests : బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం రేపుతోంది. పోలీసులు, అధికారులు తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియో విడుదల చేశాడు.

IIIT Basara Students Protests : బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం రేపుతోంది. పోలీసులు, అధికారులు తమను బెదిరిస్తున్నారని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియో విడుదల చేశాడు. రేపు నిరసన ఆపకపోతే వెయ్యి మంది పోలీసులను దింపుతామని బెదిరిస్తున్నారని విద్యార్థి వాపోయాడు. ఇవాళ రాత్రి క్యాంపస్ లో వాటర్, పవర్, ఫుడ్ పూర్తిగా ఆపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పాడు. తమను బెదిరిస్తున్నారు అంటూ విద్యార్థి విడుదల చేసిన ఆడియో కలకలం రేపుతోంది.
నిరసన బాట పట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బాసర ట్రిపుల్ ఐటీ ఏవోపై వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అటు.. విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చల్లో గందరగోళం ఏర్పడింది. చర్చలు సఫలం అయ్యాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొనగా, చర్చలు విఫలం అయ్యాయని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రేపు కూడా ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించారు. బాసర ట్రిపుల్ ఐటీకి సీఎం కేసీఆర్ రావాలని పట్టుబడుతున్నారు.(IIIT Basara Students Protests)
విద్యార్థుల నిరసనల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి, ఆందోళన విరమణ కోసం వారిని కొందరు హెచ్ఓడీలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళన విరమించుకుంటే భోజనం పెట్టం అని హెచ్చరించిన హెచ్ఓడీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
Basara IIIT Students: రెండో దశ చర్చలు విఫలం.. సీఎం కేసీఆర్ రావాల్సిందేనంటూ విద్యార్థుల డిమాండ్..
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి స్పందించారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన విరమించాలని కోరుతూ విద్యార్థులకు లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ‘‘ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నారనే నా ఆవేదన. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దు. విద్యార్థుల ఆందోళనలు చూస్తే మంత్రిగా, ఓ అమ్మగా బాధేస్తోంది. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్ని నియమించాం. ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వెంకటరమణను ప్రభుత్వం మీ వద్దకు పంపింది. ఇది మీ ప్రభుత్వం దయచేసి చర్చించండి’’ అని లేఖలో కోరారు మంత్రి సబిత.
కాగా, నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ఐదో రోజుకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంపై విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ ఇస్తున్న హామీని తోసిపుచ్చారు. ఆదివారం కూడా ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు స్పష్టం చేశారు. మరోవైపు క్యాంపస్ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. నిజామాబాద్-భైంసా రూట్లలో పికెటింగ్లు ఏర్పాటు చేశారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
విద్యాలయంలో సమస్యల పరిష్కారానికి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 12 డిమాండ్లు తీర్చాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వీటిలో కొన్నింటికీ ప్రభుత్వం ఓకే చెబుతున్నా విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ విద్యాలయాన్ని సందర్శించి తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే నాలుగో రోజు ప్రతిపక్షాల నాయకులు విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లగా.. విద్యాలయంలోని విద్యార్థులను కలవనీయకుండా అరెస్టు చేసి బయటికి తీసుకొచ్చి విడిచిపెట్టారు.
- Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
- CM KCR: మోదీ వల్ల దేశం పరువు పోతోంది.. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు?
- CM KCR-Yashwant sinha : యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నా : కేసీఆర్
- Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
- BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
1Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
2Bandi Sanjay: టీఆర్ఎస్ సర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ దరఖాస్తులు
3Kaali : ‘కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ పై క్షమాపణలు చెప్పిన అగాఖాన్ మ్యూజియం.. మరింత రెచ్చగొట్టేలా డైరెక్టర్ పోస్ట్..
4Covid Vaccine: కోటి 36లక్షల కొవిడ్ డోసులు చెత్త బుట్టలోకి..
5China: చైనాలో మళ్ళీ కరోనా కలకలం.. లాక్డౌన్లో కోట్లాది మంది ప్రజలు
6Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్నాథ్ షిండే.. డ్రమ్స్ వాయించిన భార్య లత.. వీడియో
7Gautam Raju : ఎడిటర్ గౌతంరాజుకి నివాళులు అర్పిస్తూ ప్రెస్నోట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్..
8Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలిపిన బాలకృష్ణ
9ysrcp: వైసీపీ ప్లీనరీలో ప్రసంగించనున్న విజయమ్మ.. చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమానికి..
10Abused Police: పోలీసును తిట్టిన వ్యక్తికి 1.7 సంవత్సరాల జైలు శిక్ష
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?