BJP Leaders: ఖమ్మం, రామాయంపేట్ సూసైడ్‌లపై కమలనాథుల సీరియస్

ఖమ్మం, రామాయంపేట్ ప్రాంతాల్లో జరిగిన ఆత్మహత్యలను కమలనాథులు సీరియస్ గా తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సాక్షాత్..

BJP Leaders: ఖమ్మం, రామాయంపేట్ సూసైడ్‌లపై కమలనాథుల సీరియస్

Telanganbjp

BJP Leaders: ఖమ్మం, రామాయంపేట్ ప్రాంతాల్లో జరిగిన ఆత్మహత్యలను కమలనాథులు సీరియస్ గా తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సాక్షాత్ కేంద్ర మంత్రి ఖమ్మంకు రానున్నారు.

బుధవారం రాజీవ్ చంద్రశేఖర్… ఖమ్మం రానుండగా ఇప్పటికే సాయిగణేశ్ కుటుంబ సభ్యులతో అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. కుటుంబానికి తాను అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు.

రామాయంపేట ఆత్మహత్య బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యేలు ఈటల, రఘనందనరావు పరామర్శించారు. ఆత్మహత్యలపై బీజేపీ బృందం గవర్నర్‌ను కలవనున్నారు.

Read Also: టీఆర్ఎస్, బీజేపీ మధ్య లేఖల పర్వం..!

ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతల అకృత్యాలతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయంటూ బీజేపీ విమర్శలకు దిగింది. న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను కాపాడాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను కోరనున్నారు.

ప్రస్తుతం ఖమ్మంలో పర్యటిస్తోన్న బీజేపీ లీగల్ సెల్… ఘటనల పట్ల న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుంది.