మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కరోనాతో మృతి

మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కరోనాతో మృతి

Former MLA Katta Venkatanarsaya dies with Corona : సీపీఎం మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఓ ప్రవేట్‌ ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య కరోనాతో మృతి చెందారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి సీపీఎం తరపున రెండుసార్లు ఎమ్మేల్యే గెలిచారు. పోచారం గ్రామానికి చెందిన కట్టా వెంకటనరసయ్య మృతి చెందడంతో… పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయన మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ నేతలు చెప్పారు.

యుక్త వయసు నుంచి వెంకటనర్సయ్య రాజకీయాల్లో ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన ఆయన ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. చనిపోయేంత వరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశారు.

కట్టా వెంకటనర్సయ్య మృతి పట్ల సీపీఎం జిల్లా నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఎప్పుడూ రాజీ పడకుండా విలువలే ఆస్తిగా బతికారని ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అరుదైన నేత అని కొనియాడారు.