Bharat jodo yatra: తెలంగాణను విడిచి మహారాష్ట్రకు వెళ్తున్నాను.. బాధగా ఉంది: రాహుల్ గాంధీ

తెలంగాణను విడిచి మహారాష్ట్రకు వెళ్తున్నానని.. బాధగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడోయాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో తన యాత్రను ముగించుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద భారత్ జోడోయాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో రాహుల్ మాట్లాడారు. తెలంగాణ వీధుల్లో నడుస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు. తన పాదయాత్రను ఏ శక్తీ ఆపలేదని చెప్పారు. పాదయాత్రలో ఎన్నో విషయాలను గమనించానని తెలిపారు.

Bharat jodo yatra: తెలంగాణను విడిచి మహారాష్ట్రకు వెళ్తున్నాను.. బాధగా ఉంది: రాహుల్ గాంధీ

Bharat jodo yatra: తెలంగాణను విడిచి మహారాష్ట్రకు వెళ్తున్నానని.. బాధగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడోయాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో తన యాత్రను ముగించుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద భారత్ జోడోయాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో రాహుల్ మాట్లాడారు.

తెలంగాణ వీధుల్లో నడుస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు. తన పాదయాత్రను ఏ శక్తీ ఆపలేదని చెప్పారు. పాదయాత్రలో ఎన్నో విషయాలను గమనించానని తెలిపారు. ఇంజనీరింగ్ చదువులకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని చెప్పారు.

తెలంగాణ ప్రజల కలలను టీఆర్ఎస్ విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు. దళితులు, గిరిజనుల భూములను టీఆర్ఎస్ లాక్కొంటోందని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారో తన కళ్లారా చూశానని రాహుల్ గాంధీ చెప్పారు. దెబ్బలు తగులుతున్నా భయపడకుండా పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..