Minister KTR : అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదన్నారు.. కారణం సీఎం కేసీఆర్ పాలనే..

సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందని తెలిపారు. పర్యావరణం,పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందని..తెలంగాణలో సమగ్ర, సమత్యులత, సమ్మిళిత అభివృద్ధి జరిగిందన్నారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామన్నారు.

Minister KTR : అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదన్నారు.. కారణం సీఎం కేసీఆర్ పాలనే..

TS IT Minister KTR

TS IT Minister KTR : చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండీస్ట్రియల్ పార్క్ లో జరిగిన తెలంగాణ  (Telanagana) పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. దండుమల్కాపూర్ లో మంత్రి 51 పరిశ్రమలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు.. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందని తెలిపారు. పర్యావరణం, పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందని.. తెలంగాణలో సమగ్ర, సమత్యులత, సమ్మిళిత అభివృద్ధి జరిగిందన్నారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామన్నారు.

 

మన తెలంగాణ TS ఐ పాస్ విధానంలో 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం మనది అని అన్నారు. అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదన్నారని ఈ విషయాన్ని స్వయంగా అమెరికాలో పారిశ్రామిక వేత్తలు చెప్పారని అన్నారు. కాగా ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటించి పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన విషయం తెలిసిందే. మానవ చరిత్రలో మూడవ అతి పెద్ద కార్యక్రమం మన హరితహారం కార్యక్రమం అని, భవిష్యత్తు తరాలకు పచ్చటి వాతావరణం అందిస్తున్నామని అన్నారు. పల్లె పాలనలో 30 జాతీయ స్థాయి అవార్డులు మన పల్లెలు సాధిస్తున్నాయని తెలంగాణ పచ్చని తెలంగాణ అని చెప్పటానికి ఇవే నిదర్శనమయ్యారు. పట్టణాలు కూడా జాతీయ అవార్డు లు అందుకుంటున్నాయని దాని వాటి అభివృద్ధే నిదర్శనమన్నారు. తెలంగాణలో మారు మూల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారని దానికి కారణం సీఎం కేసీఆర్ పాలనేనని అన్నారు.

 

తెలంగాణను అవహేళన చేసిన వాళ్ళు కనుమరుగు అయ్యారని.. సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ ని పొగిడారని గుర్తు చేశారు. రజనీకాంత్ షూటింగుల కోసం ఎన్నో దేశాలు తిరుగుతుంటారు.. కానీ మన హైదరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి జరిగింది అని కితాబిచ్చారని గుర్తు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ రోజుకు కూడా కరంట్ కోతలు ఉన్నాయి.. పక్కా రాష్ట్రాల్లో వెళ్లి ఎలాంటి పరిస్థితి ఉందొ తెలుసుకోండి అంటూ సూచించారు. పచ్చదనానికి మారు పేరు తెలంగాణ అని అన్నారు. గ్రీన్ బడ్జెట్ పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మన కేసీఆర్ 60 ఏళ్లలో జరిగని పని ఈ తొమ్మిది ఏళ్లలో చేసి చూపించారని అన్నారు. మన ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతుందని స్వయంగా అమెరికా ఇంజనీర్లు అన్నారని తెలిపారు కేటీఆర్. అదీ తెలంగాణకు దక్కిన గొప్ప గౌరవం అని అన్నారు.

 

ఐటీ ఎగుమతులను పెంచామని.. ధాన్యం దిగుబడులు రికార్డ్ స్థాయిలో వస్తున్నాయని అన్నారు. ఇవి తెలంగాణ విజయాలు.. వాస్తవాలు చెప్పుకోవాల్సిందేనన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అఖండ విజయాలను సాధించిందని.. దండుమల్కాపూర్ పార్క్ లో ఏర్పాటు చేసిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ లో వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.