KTR: ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోవాలని అన్నారు.. ఇప్పుడేమో ఇక్కడకు వచ్చి..: కేటీఆర్

మోదీ తన తొమ్మిదేళ్ల పాలనలో దేశ యువత కోసం చేసిన ఏం చేశారని, కనీసం ఒక్క మంచి పనైనా చేసి, దాని గురించి వివరించి చెబితే బాగుండేదని కేటీఆర్ అన్నారు.

KTR: ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోవాలని అన్నారు.. ఇప్పుడేమో ఇక్కడకు వచ్చి..: కేటీఆర్

KTR

KTR – Narendra Modi : బీఆర్ఎస్ (BRS) పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు తెలంగాణ (Telangana) మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోవాలని మోదీ అన్నారని, ఇప్పుడు వరంగల్ వచ్చి యువత, ఉద్యోగాల గురించి ఆయన మాట్లాడటం వింతగా ఉందని చెప్పారు.

మోదీ తన తొమ్మిదేళ్ల పాలనలో దేశ యువత కోసం చేసిన ఏం చేశారని, కనీసం ఒక్క మంచి పనైనా చేసి, దాని గురించి వివరించి చెబితే బాగుండేదని కేటీఆర్ అన్నారు. భారత చరిత్రలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం మోదీ పాలనలో పెరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఖాళీలు భర్తీచేయలేదని అన్నారు.

ఇప్పుడు తెలంగాణకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని అంటున్నారని కేటీఆర్ చెప్పారు. తాము 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ అన్నారు. సర్కారు పంపిన బిల్లులను ఆమోదించకుండా యూనివర్సిటీ ఖాళీల భర్తీని గవర్నర్ తమిళిసై అడ్డుకున్నారని కేటీఆర్ చెప్పారు.

సానుకూల నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ కి ప్రధాని ఒక మాట చెబితే బాగుండేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గిరిజన వర్సిటీ అడ్డుకుని, ఇప్పుడు అడవి బిడ్డల గురించి మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు. 15,000 మంది స్థానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి కూడా మోదీ ఏమీ మాట్లాడలేదని చెప్పారు. నల్ల చట్టాలతో మోదీ 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్నారని, ఇప్పుడు వరంగల్ వచ్చి వ్యవసాయం గురించి మాట్లాడడం ఏంటని నిలదీశారు.

Boinapally Vinod Kumar : తెలంగాణలో బీజేపీ గెలవదని మోదీ మాటల్లోనే తెలుస్తోంది, అది ఆయనే అంగీకరించారు : వినోద్ కుమార్