Raja Singh : కనీసం లక్ష కూడా కట్టలేదు- డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్

మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? అనేది ప్రజలకు అనవసరం. Raja Singh - KTR

Raja Singh : కనీసం లక్ష కూడా కట్టలేదు- డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్

Raja Singh - KTR (Photo : Google)

రెండో విడత పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఏదేదో మాట్లాడారని రాజాసింగ్ విమర్శించారు.

”2.16 లక్షల ఇళ్లు కట్టినట్లు గూగుల్ ద్వారా తెలిసింది. కానీ లక్ష ఇళ్లు కూడా కట్టలేదు. తెలంగాణ ప్రజలు ఇళ్లు కావాలని అడుగుతున్నారు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? అనేది ప్రజలకు అనవసరం. మీరు మంచి చేస్తే ప్రజలు మీకే ధన్యవాదాలు చెబుతారు. 25లక్షల మందికి పైగా ప్రజలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఎంతమందికి కేసీఆర్ సర్కార్ ఇళ్లు ఇస్తుందో చెప్పాలి.

Also Read..YS Sharmila : షర్మిలకు బిగ్ షాక్..? కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనానికి చెక్..! కారణం అదేనా? షర్మిల ఏం చేయనున్నారు?

ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఇళ్లు ఎక్కడా కట్టలేదని కేటీఆర్ చెబుతున్నారు. యూపీలో 15.70 లక్షల సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు, మధ్యప్రదేశ్ లో 7లక్షల 80 వేల ఇళ్లు, మహారాష్ట్రలో 11 లక్షల 70వేల ఇళ్లు, గుజరాత్ లో 6 లక్షల 40 వేలు ఇళ్లు, హర్యానాలో 2 లక్షల 65 వేల ఇళ్లు, అస్సాంలో ఒక లక్ష 55 వేల ఇళ్లు కట్టించి ఇచ్చారు. పేదలు అద్దెలు కట్టి కట్టి, గుడిసెలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి పక్కన పెడితే.. కనీసం సింగిల్ బెడ్రూం ఇళ్లైనా ఇవ్వండని ప్రజలు వేడుకుంటున్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీమ్ గురించి తెలంగాణలో విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. కానీ, ఇళ్లు ఇవ్వడం లేదు. కట్టి అలా వదిలేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మీరు ఎన్ని కడతారో కట్టి ఇవ్వండి. దాంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సింగిల్ బెడ్రూమ్ ఇళ్లైనా కట్టించి ఇవ్వండి” అని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.

Also Read..Telangana: పార్టీ సింబల్ బెంగాల్ టైగర్.. ఎలక్షన్ సింబల్ సింహం.. క్యూ కడుతున్న రెబల్స్!