MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత

కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ ‌కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కోరుట్ల టీఆర్ఎస్ పార్టీకి ‌పెట్టని‌ కోట అని అభివర్ణిస్తూ.. జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గాలన్నీ గెలిచేందుకు కార్యకర్తలు ‌కృషి చేయాలని పిలుపునిచ్చారు.

MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha

 

 

MLC Kavitha: కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ ‌కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కోరుట్ల టీఆర్ఎస్ పార్టీకి ‌పెట్టని‌ కోట అని అభివర్ణిస్తూ.. జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గాలన్నీ గెలిచేందుకు కార్యకర్తలు ‌కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఘనత టీఆర్ఎస్ పార్టీది:
“ప్రజలు కోరిన విధంగా కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసుకోగలిగాం. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చాం. భారతదేశంలో చిత్రపటం మార్పు చేసి.. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నంబర్ వన్‌గా నిలిపిన ఘనత టీఆర్ఎస్ పార్టీది”

సగర్వంగా, సమాధానం చెప్పాలి:
“కోరుట్లలో ఉన్న బీడీ కార్మికులకు రూ.2 వేలు పెన్షన్ ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లోని బీడీ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదు? గులాబీ కండుగా మెడలో వేసుకుని టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శకులకు దీటుగా, సగర్వంగా, సమాధానం చెప్పాలి”

అవినీతి లేకుండా పాలన:
“ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. దేశం మొత్తంలో అవినీతి లేకుండా పాలన అందిస్తున్న నాయకులు సీఎం కేసీఆర్ మాత్రమే”

దేవుడి పేరుతో రాజకీయం:
“వాళ్లు జై శ్రీ రాం అంటే, మనం జై హనుమాన్ అనాలి. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకోం.

తెలంగాణ ఉద్యోగాలు స్థానికులకే:
“తెలంగాణ తెచ్చుకున్నది యువత కోసం. తెలంగాణలో ఉద్యోగాలు 95% స్థానికులకే వచ్చేలా చేసాం. యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దం కావాలి”

8 వేల కోట్లు రీయింబర్స్‌మెంట్:
“దళిత వర్గాలకు దళిత బందు అమలు చేస్తున్నాం. బీసీలకు విద్య కోసం గతంలో కేవలం 7000 మంది బీసి విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం ఉంటే, ప్రస్తుతం 281 బీసి హాస్టల్‌ ఏర్పాటు చేసి,1300 కోట్లతో లక్షా 32 వేల బీసి విద్యార్థులను చదివిస్తున్నాం.96 లక్షల విద్యార్థులకు 8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాం”

రైతులకు ఏం చెయ్యలేదు:
“టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను గ్రామాల్లో చర్చపెట్టాలి. ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్లకు మర్యాద ఇవ్వాలి. గెలిచిన ఎంపీ అరవింద్‌కు 3 ఏళ్లు అవకాశమిచ్చినా, రైతులకు ఏం చెయ్యలేదు”

అబద్దాలకు ప్రతిరూపం అరవింద్:
“పసుపు బోర్డు బదులు తెచ్చినా ఆఫీస్ కూడా నేను తెచ్చిందే. మనం చేసిన పనులు కూడా, వాళ్ళె చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అబద్దాలకు ప్రతిరూపం అరవింద్. అమెరికా వెళ్లి, అక్కడ కూడా అరవింద్ అబద్ధాలు చెప్తున్నాడు”

హామీలు ఏమయ్యాయి:
“మోదీ హయాంలో పెట్రోల్ నుండి నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయి. రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, అందరి అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయల లాంటి హామీలు ఏమయ్యాయి?”

మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమో”
“కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, బీజేపీని ఎందుకు విమర్శించరు? పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై బీజేపీని ఎందుకు విమర్శించరు? మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమో?”

రచ్చబండ నిర్వహిస్తే:
“కాంగ్రెస్ నాయకులు రైతు రచ్చబండ నిర్వహిస్తే, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూపించండి”

జీవన్ రెడ్డిని నిలదీయాలి:
“తెలంగాణకు రావాల్సిన ‌బకాయిల గురించి పార్లమెంటులో మాట్లాడాలని రాహుల్ గాంధీని కోరాల్సిందిగా జీవన్ రెడ్డిని ప్రజలు నిలదీయాలి”

అంటూ కోరుట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ  కవిత భారీ సభల్లో పాల్గొంటున్నారు.