TRS MLAs trap issue : ఫాంహౌజ్ ఘటన టీఆర్ఎస్ డ్రామా..అక్కడ దొరికిన డబ్బు ఎక్కడుంచి వచ్చింది? ఎవరిదో బయటపెట్టాలి : కిషన్ రెడ్డి

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆపరేషన్ ఆకర్ష్ పై... టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఘటనపైకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఫాంహౌజ్ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో పోలీసులు పెద్ద మొత్తంలో సీజ్ చేశారని చెబుతున్న డబ్బు ఎంత?.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

TRS MLAs trap issue : ఫాంహౌజ్ ఘటన టీఆర్ఎస్ డ్రామా..అక్కడ దొరికిన డబ్బు ఎక్కడుంచి వచ్చింది? ఎవరిదో బయటపెట్టాలి : కిషన్ రెడ్డి

TRS MLAs trap issue

TRS MLAs trap issue : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆపరేషన్ ఆకర్ష్ పై… టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఘటనపై గురువారం (అక్టోబర్ 27,2022)మధ్యాహ్నం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఫాంహౌజ్ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో పోలీసులు పెద్ద మొత్తంలో సీజ్ చేశారని చెబుతున్న డబ్బు ఎంత?.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ డబ్బును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకువచ్చారా?.. లేదంటే కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి వచ్చిందా? అని ప్రశ్నించారు.

మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఈ రూ.100కోట్ల డ్రామా ప్లాన్ చేశారని ఆరోపించారు. అసలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అనే విషయం అందరికి తెలుసన్నారు.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గౌరవిస్తూ… ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎవరైనా బీజేపీలోకి వస్తామంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయించి మరీ పార్టీలోకి చేర్చుకుంటున్నామని దానికి ఉదాహరణ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డేనని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి లాగిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ రాజీనామా చేయించారా? అని ప్రశ్నించారు.

TRS MLAs trap issue : MLAల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ..హైకోర్టులో బీజేపీ పిటిషన్..

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందన్న భయంతోనే కేసీఆర్ కొత్త నాటకానికి తెర తీశారని..సరిగ్గా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమైందని సర్వేలు తేల్చిచెప్పగా పోలింగ్ కు ముందు రోజు రఘునందన్ రావు ఇంటిపై ఎలా దాడి చేశారో… ఇప్పుడు మునుగోడు ఎన్నికలో ఓటమి భయంతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారని అన్నారు కిషన్ రెడ్డి. బీజేపీకి నేతలను బేరాలు ఆడే సంస్కృతి కాదని అంటే టీఆర్ఎస్ నేతలు డబ్బులు ఆశ చూపెడితే దిగజారిపోయేవారన్నమాట అంటూ ఎద్దేవా చేశారు. ఫాంహౌస్ నలుగురు ఎమ్మెల్యేలు ప్రజాకర్షణ కలిగిన నేతలా? అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ దాడులంటూ టీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు చేసి ప్రజల వద్ద సానుభూతి పొందేందుకు చేసిన యత్నం విఫలం కావడంతో ఈ ఫాంహౌజ్ డ్రామాకు కేసీఆర్ ప్లాన్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

ఈ ఘటనపై బీజేపీ నేత లక్ష్మణ మాట్లాడుతూ..టీఆర్ఎస్ రూ.100కోట్ల సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది అంటూ ఎద్దేవా చేశారు. ఫాంహౌజ్ ఘటనపై సీపీ స్టీఫెన్ మాటలకు..టీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు మాటలకు ఎక్కడా పొంతలేదని టీఆర్ఎస్ నేతలు మాట్లాటే మాటలకు ఫాంహౌజ్ జరిగిన వ్యవహారానికి ఎక్కడా పొంతన కుదరటంలేదని ఇదంతా కేసీఆర్ ఆడించిన డ్రామా అని అర్థం అవుతోందని అన్నారు. ఫాంహౌస్ లో ఉన్నవారు ఢిల్లీ నుంచి వచ్చారని అంటున్నారు…వారు ఎక్కడినుంచి వచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నందకుమార్ అనే వ్యక్తి టీఆర్ఎస్ నేలతో ఎంత సన్నిహితంగా ఉన్నారో తెలుస్తోందని మునుగోడులో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ ఈ ఫాంహౌజ్ డ్రామాకు తెరతీశారు అంటూ ఆరోపించాడరు లక్ష్మణ్.