Chalamala Krishna Reddy : మునుగోడులో కచ్చితంగా పోటీ చేస్తా, నల్లొండ జిల్లాలో నా తడాఖా ఏంటో చూపిస్తా- కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి హాట్ కామెంట్స్

వీళ్ల పెళ్లాలకు, పిల్లలకు, తమ్ముళ్లకు టికెట్ కావాలి. పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వరా? అక్కడక్కడ డబ్బులు ఇచ్చి గొప్ప వాళ్ళమని సంకలు గుద్దుకుంటున్నారు కోమటి రెడ్డి బ్రదర్స్. Chalamala Krishna Reddy

Chalamala Krishna Reddy : మునుగోడులో కచ్చితంగా పోటీ చేస్తా, నల్లొండ జిల్లాలో నా తడాఖా ఏంటో చూపిస్తా- కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి హాట్ కామెంట్స్

Chalamala Krishna Reddy On Raj Gopal Reddy (Photo : Google)

Chalamala Krishna Reddy On Raj Gopal Reddy : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఆ పార్టీలో చిచ్చు రాజేసింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కచ్చితంగా తమకే టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న నేతలు.. తీరా టికెట్ దక్కకపోయే సరికి తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కొందరు నాయకులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు పార్టీ మారాలని నిర్ణయించుకుంటే, మరికొందరు రెబల్ గా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు.

ఇక, మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి.. మునుగోడు టికెట్ ను తనను కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో తన అనుచరులతో కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించారు.

Also Read : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఇటీవలే పార్టీలో చేరి టికెట్లు దక్కించుకున్న వారు వీరే

”మునుగోడు బరిలో నేను కచ్చితంగా ఉంటా. నేను అందరిలా బొక్కల కోసం ఎదురు చూసే వ్యక్తిని కాదు. మొదటి లిస్టులో ఉన్న నా పేరు సెకండ్ లిస్టులో లేకుండా చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మీ మీ కుటుంబాలు తప్ప ఏమీ అభివృద్ధి జరగలేదు. వీళ్ల పెళ్లాలకు, పిల్లలకు, తమ్ముళ్లకు టికెట్ కావాలి. పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వరా? అక్కడక్కడ డబ్బులు ఇచ్చి గొప్ప వాళ్ళమని సంకలు గుద్దుకుంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్.

మునుగోడులోనే కాదు మొత్తం నల్గొండ జిల్లాలో నా తడాఖా చూపిస్తా. నేను డబ్బుకు తలొంచను. ప్రజలకే తలొంచుతా. రేవంత్ రెడ్డిని కూడా ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఉప ఎన్నికల్లో సీటు ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చేశా. మునుగోడులో స్థానికుడైన నేను మాత్రమే అభివృద్ధి చేశా. పైసల రాజకీయం చేసే రాజగోపాల్ రెడ్డి.. రానున్న రోజుల్లో ప్రజలు నీకు బుద్ది చెబుతారు. సేవ్ మునుగోడు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తా” అని చలమల కృష్ణారెడ్డి అన్నారు.

Also Read : మళ్లీ కేసీఆర్ రాకుంటే.. అమరావతిలా హైదరాబాద్- మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు