Yadadri క్యూ లైన్లు ఇలా ఉంటాయి

  • Published By: madhu ,Published On : September 17, 2020 / 12:42 PM IST
Yadadri క్యూ లైన్లు ఇలా ఉంటాయి

YADADRI : యాదాద్రి క్యూలైన్లను అధికారులు అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆర్కెటెక్టు ఆనంద్‌ సాయి పర్యవేక్షణలో నూతన క్యూలైన్ల డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవలే సీఎం కేసీఆర్ యాదాద్రి వచ్చి పునర్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగా క్యూ లైన్లకు సంబంధించిన డిజైన్లను చూపించారు. క్యూలైన్లకు సంబంధించిన పవర్‌ ప్రజంటేషన్‌ ఆర్కెటెక్టు ఆనంద్‌సాయి ఇచ్చారు. క్యూలైన్‌ అద్భుతంగా ఉండటంతో సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సూచించిన పలు మార్పులను చేసి క్యూ లైన్లను డిజైన్ కు ఒకే చెప్పారు.



స్వామి వారి దర్శనానికి వెళ్లిన సమయంలో..ఆధ్యాత్మికత, ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దారు. భక్తుల రద్దీ ఉన్న రోజుల్లో క్యూలైన్లను పెంచే విధంగా, భక్తులు లేని రోజుల్లో క్యూలైన్లను ఒకే దగ్గరికి చేర్చే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు.
ఆలయం అంతా బంగారు వర్ణంలో తీర్చిదిద్దుతున్నారు
https://10tv.in/demolition-of-mla-aruri-ramesh-camp-office/
వైటీడీఏ అధికారులు. విద్యుత్‌ దీపాల అలంకరణ, ఆలయంలోని ప్రధాన గర్భాల ద్వారాలు, విమాన రాజగోపురం వంటివి బంగారు రంగులో మెరిసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే క్యూలైన్లను సైతం బంగారు రంగులో ఉండనుంది. విశాలమైన క్యూలైన్లు, మధ్యల మధ్యలో భక్తులు కూర్చోవడానికి బెంచీలు, అక్కడక్కడ ఆధ్మాతిక చిత్రాలు ఉండే విధంగా క్యూలైన్‌ ఏర్పాటు చేయనున్నారు.



ప్రసాదం కౌంటర్‌ నుంచి బ్రహ్మోత్సవ మండపం వెనుక నుంచి అష్టభుజి ప్రాకార మండలంలో నుంచి తూర్పు రాజగోపురం కింది నుంచి ఒక లైన్, బ్రహ్మోత్సవ మండపం నుంచి అష్టభుజి ప్రాకార మండపం నుంచి దక్షిణ రాజగోపురం కింది నుంచి ప్రధాన ఆలయంలోకి వెళ్లే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.




దర్శనం అనంతరం భక్తులు నేరుగా పడమటి రాజగోపురం నుంచి బయటకు వెళ్లకుండా ఆలయ నిర్మాణాలు, ఆధ్మాత్మిక కట్టడాలు చేసేందుకు వీలుగా క్యూలైన్లు ఉండాలని సూచనలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.మూడు వరుసల క్యూలైన్‌ ఏర్పాటు చేయడంతో భక్తులతో పాటు ఆచార్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసే విధంగా వైటీడీఏ అధికారులు ఆలోచిస్తున్నారు.