Amaravati Farmers Maha Padayatra : గుడివాడలో హైఅలర్ట్.. రంగంలోకి 400మందికిపైగా పోలీసులు.. రైతుల పాదయాత్రపై స్పెషల్ ఫోకస్

గుడివాడలో అమరావతి రైతుల మహా పాదయాత్రపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. జిల్లా నలుమూలల నుంచి 400 మందికిపైగా పోలీసులు, అధికారులు గుడివాడకు చేరుకున్నారు.

Amaravati Farmers Maha Padayatra : గుడివాడలో హైఅలర్ట్.. రంగంలోకి 400మందికిపైగా పోలీసులు.. రైతుల పాదయాత్రపై స్పెషల్ ఫోకస్

Updated On : September 24, 2022 / 5:11 PM IST

Amaravati Farmers Maha Padayatra : గుడివాడలో అమరావతి రైతుల మహా పాదయాత్రపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. జిల్లా నలుమూలల నుంచి 400 మందికిపైగా పోలీసులు, అధికారులు గుడివాడకు చేరుకున్నారు. గుడివాడలోని మార్కెట్ యార్డులో అధికారులు, పోలీసులకు రూట్లు కేటాయించారు. ముందస్తు చర్యగా వజ్ర వాహనాలు, ఎస్వోటీ టీమ్ లు రంగంలోకి దిగాయి. వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

అమరావతి నుంచి అరసవల్లికి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలో ప్రవేశించింది. గుడివాడ ప్రజలు రైతులకు సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడొచ్చన్న నేపథ్యంలో పట్టణంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున రోప్ పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. గుడివాడ చేరుకున్న రైతులను పోలీసులు రోప్ ల నడుమ ముందుకు తీసుకెళుతున్నారు. ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రత మధ్య రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు బైక్ పై గుడివాడ చేరుకున్నారు.

కాగా, గుడివాడలో రైతుల పాదయాత్ర నేపథ్యంలో, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చింతమనేని గుడివాడ వెళతారన్న అంచనాల నేపథ్యంలో ఏలూరులోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చింతమనేనికి నోటీసులు ఇచ్చారు.