AP Covid-19 Live Updates: గుడ్ న్యూస్.. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

  • Published By: sreehari ,Published On : October 11, 2020 / 06:47 PM IST
AP Covid-19 Live Updates: గుడ్ న్యూస్.. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

Updated On : October 11, 2020 / 6:47 PM IST

AP Covid-19 Live Updates: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 75,517 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో 5,509 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.



రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 7,55,727లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి 30 మంది మరణించారు. 5,509 మంది కరోనాను పూర్తిగా జయించి ఆదివారం డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 7,55,727 పాజిటివ్ కేసులకు 7,03,208 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 65,69,616 మందికి శాంపిల్స్ పరీక్షించగా.. 46,295 యాక్టివ్ కేసులు ఉన్నాయి.



కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,224కు చేరుకుంది. ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల ప్రకాశంలో ఎనిమిది మంది, చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.