AP Omicron: ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెర్రర్ పుట్టిస్తోంది.

Omicron
AP Omicron: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెర్రర్ పుట్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా ఉండగా.. ఈ సమయంలోనే ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.
లేటెస్ట్గా రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో 52 ఏళ్ళ వ్యక్తికి ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారిలో ఈ కొత్త వేరియంట్ బయటపడింది.
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి బెంగళూరు మీదుగా ప్రకాశం జిల్లాకు వచ్చిన సదరు వ్యక్తికి ఒమిక్రాన్ సోకిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
అయితే, అఅతని ప్రైమరీ కాంటాక్ట్లు 14మందికి RTPCR టెస్ట్ నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి కూడా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగానే ఉన్నారు.