ఏపీలో కొత్తగా 1,886 కరోనా కేసులు. 12 మంది మృతి

  • Published By: sreehari ,Published On : November 10, 2020 / 06:58 PM IST
ఏపీలో కొత్తగా 1,886 కరోనా కేసులు. 12 మంది మృతి

Updated On : November 10, 2020 / 7:08 PM IST

AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 8 లక్షలు దాటేశాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 67,910 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.



వారిలో కొత్తగా 1,886 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి 12 మంది మరణించారు.



గత 24 గంటల్లో 2,151 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 8,14,773 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 87,92,935 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.



ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, అనంతపూర్ లో ఒక్కరు, తూర్పు గోదావరిలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.