ఐఏఎస్ అధికారి కృష్ణ తేజకు అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మైలవరపు కృష్ణతేజ ఆంద్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వాసి. ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన

ఐఏఎస్ అధికారి కృష్ణ తేజకు అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Minister Pawan Kalyan

Updated On : June 15, 2024 / 11:24 AM IST

Minister Pawan Kalyan : జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎమ్.వి.ఆర్.కృష్ణ తేజకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈమేరకు పవన్ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణ తేజ కేరళ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియడారు. ప్రస్తుతం త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతల్లోఉన్న ఆయన ఆ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు ఉత్తమ విధానాలు అనుసరించారని, కరోనా కష్ట కాలంలో, కేరళ వరదల విపత్తు సమయంలో కృష్ణ తేజ విధి నిర్వహణలో చూపిన అంకిత భావాన్ని ఆ రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని పవన్ పేర్కొన్నారు. ఆయన తన విధినిర్వహణలో ప్రజలకు మరింతగా సేవలు అందిస్తూ ఉద్యోగులకు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read : CM Chandrababu Naidu : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ..

కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ఆంద్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వాసి. ప్రస్తుతం కేరళలోని త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అతను మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి శివానంద కుమార్ హోల్ సేల్ వ్యాపారి, తల్లి భువనేశ్వరి గృహిణి. ఐఏఎస్ కావాలనే పట్టుదలతో నాలుగు సార్లు పరీక్షరాసి చివరకు 66వ ర్యాంకు సాధించాడు. త్రిస్సూర్ లో బాల హక్కుల రక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టి, జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ఆయన చేసిన కృషికిగాను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డు వరించింది.