కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.

కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. కరోనాకు సంబంధించి కొత్తగా 15 రకాల ప్రొసీజర్స్ ను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. కరోనా అనుమానం, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరలను నిర్ణయించింది. కనీసం రూ.16 వేల నుంచి గరిష్టంగా రూ.2.16 లక్షలుగా వైద్య ఖర్చుగా ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో కరోనా బాధితులకు వైద్య చికిత్స చేయనున్నారు. (షర్ట్ కింద లుంగీ కట్టుకుంటా: ఆనంద్ మహీంద్రా)
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలవరం రేపుతోంది. రాష్ట్రంలో కోవిడ్ 19 కేసులు 266కు చేరుకున్నాయి. మర్కజ్ సదస్సు కేసులు రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 60 కరోనా కేసులు నమోదవగా.. అందులో కర్నూలులో అత్యధికంగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6గంటల నుంచి 9గంటల వరకు జరిగిన పరీక్షల్లో కొత్తగా 14కేసులు నమోదు అయ్యాయి.
కొత్తగా నమోదైన కేసుల్లో విశాఖ నుంచి 5, అనంతపూర్ నుంచి 3 కర్నూల్ నుంచి 3 గుంటూరు నుంచి 2, పశ్చిమగోదావరిలో ఓ కేసు నమోదు అయ్యింది. తాజా నివేధికల ప్రకారం నెల్లూరు- 34, గుంటూరు- 32, కృష్ణా- 28, ప్రకాశం- 23, కడప- 23, చిత్తూరు-17, విశాఖ- 20, పశ్చిగోదావరి-16 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి- 11, అనంతపురం-6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ భారత్ లో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 4067కి చేరుకున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గడిచిన 12 గంటల్లో ఏకంగా 490 నమోదయ్యాయని కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు అందులో 292 మంది కొలుకోగా, 109 మంది చనిపోయినట్లు వెల్లడించింది. 690 కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట తొలిస్థానంలో ఉండగా, తమిళనాడు 571, ఢిల్లీ 503 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.