AP Covid News : ఏపీలో కొత్తగా 27 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8వేల 948 కరోనా పరీక్షలు నిర్వహించగా, 27 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Covid News)

Ap Corona
AP Covid News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8వేల 948 కరోనా పరీక్షలు నిర్వహించగా, 27 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 11 పాజిటివ్ కేసులు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కేసులు వెలుగుచూశాయి. కాగా, ఆరు జిల్లాల్లో(గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం) ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 5మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క కోవిడ్ మరణం కూడా సంభవించలేదు.
కొత్త కేసులు తగ్గడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 367కి తగ్గింది. రాష్ట్రంలో నేటి వరకు కోవిడ్ తో 14వేల 730 మంది మరణించారు. రాష్ట్రంలో నేటి వరకు 23,19,475 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,04,378 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నేటివరకు 3,34,00,990 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 10వేల 502 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 41మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Covid News)
అటు దేశంలోనూ కరోనా ఉధృతి అదుపులోనే ఉంది. కొన్ని రోజులుగా రెండు వేలలోపే నమోదవుతున్న కొత్త కేసులు.. తాజాగా 1500 దిగువకు తగ్గాయి. మరోవైపు కోవిడ్ మరణాలు 150కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 6,20,251 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,421 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నిన్న మరో 149 మంది కోవిడ్ తో మరణించారు. దీంతో ఇప్పటి వరకూ దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,21,004కు చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 1,826 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ వైరస్ను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. ఆ రేటు 98.75 శాతానికి పెరిగింది.
కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటుండంతో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 16,187కు తగ్గి.. ఆ రేటు 0.04 శాతానికి క్షీణించింది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 29,90,658 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 183 కోట్లు దాటింది.
Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగ నిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.
దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
#COVIDUpdates: 27/03/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,19,475 పాజిటివ్ కేసు లకు గాను
*23,04,378 మంది డిశ్చార్జ్ కాగా
*14,730 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 367#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/724f922Ish— ArogyaAndhra (@ArogyaAndhra) March 27, 2022