AP Covid : ఏపీలో కొత్తగా 29 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 396 కరోనా పరీక్షలు నిర్వహించగా, 29 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Covid News)

AP Covid : ఏపీలో కొత్తగా 29 కరోనా కేసులు

Ap Corona

Updated On : March 28, 2022 / 6:25 PM IST

AP Covid News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 396 కరోనా పరీక్షలు నిర్వహించగా, 29 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 10 కేసులు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి. ఆరు జిల్లాల్లో (చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం) ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

గడిచిన 24 గంటల్లో మరో 50 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక్క రోజులో రాష్ట్రంలో ఒక్క కరోనా కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇంకా 346 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 14వేల 730. నేటివరకు రాష్ట్రంలో 3,34,07,386 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 8వేల 948 కరోనా పరీక్షలు నిర్వహించగా, 27 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Covid News)

India Covid-19 : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. మార్చి 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేత

అటు దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కరోనా కొత్త కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కొన్ని రోజులుగా 2వేల దిగువనే నమోదవుతున్న కొత్త కేసులు.. తాజాగా 1,200కి తగ్గాయి. మరణాలు కూడా అదే స్థాయిలో తగ్గడం ఊరట కలిగిస్తోంది.

నిన్న 4,32,389 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,270 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు 149గా ఉన్న కరోనా మరణాలు.. 24 గంటల వ్యవధిలో 31కి తగ్గాయి. పలు రాష్ట్రాలు మునుపటి గణాంకాలను సవరిస్తుండటంతో మృతుల సంఖ్యలో ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 5.21 లక్షల మంది కరోనాతో చనిపోయారు. నిన్న 1,567 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. ఇక యాక్టివ్ కేసులు 15వేల 859కి పడిపోయాయి. దాంతో మొత్తం కేసుల్లో బాధితుల సంఖ్య 0.04 శాతానికి క్షీణించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. 183 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 4,20,842 మంది టీకా వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(AP Covid News)

Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగ నిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.(AP Covid News)

దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.