Road Accident : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరికి గాయాలు కాగా

Road Accident : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

Car Accident

Updated On : November 30, 2024 / 10:19 AM IST

Vizianagaram District : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Rishiteshwari Case : తెలంగాణకు చెందిన రిషితేశ్వరి కేసు.. 9ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించిన గుంటూరు కోర్టు..

శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో విశాఖపట్టణం బయలుదేరారు. ఈ క్రమంలో కారు విజయనగరం జిల్లా భోగాపురం పరిధిలోని పోలిపల్లి వద్దకు రాగానే అతివేగంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.