Earthqauke : ఏపీలో భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు.. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదు
Earthqauke : ఏపీలో భూప్రకంపలు సంభవించాయి. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదైంది.
Earthquake
- ఏపీలోని పల్నాడు జిల్లాలో భూకంపం
- వినుకొండ, దర్శి పరిసర ప్రాంతాల్లో కంపించిన భూమి
- రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.5గా నమోదు
Earthqauke : ఏపీలో భూప్రకంపనలు సంభవించాయి. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్దారించింది.
ఈ భూకంపం ప్రభావంతో పల్నాడు జిల్లాలోని వినుకొండ, దర్శితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
తెల్లవారుజామున 2.33గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు వచ్చాయని, వినుకొండకు 20కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించడం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, నిపుణుల హెచ్చరికలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
EQ of M: 3.5, On: 19/02/2026 02:33:54 IST, Lat: 16.19 N, Long: 79.62 E, Depth: 10 Km, Location: Palnadu, Andhra Pradesh.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/CVwl6fBu2s— National Center for Seismology (@NCS_Earthquake) February 18, 2026
