Encounter: విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు
చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తుపాకుల మోత మోగింది. విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Encounter: చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తుపాకుల మోత మోగింది. విశాఖ – తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. విశాఖ జిల్లా కొయ్యురు మండలం మంప పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ ఘటన జరిగింది. అరగంటపాటు ఎదురుకాల్పులు జరగ్గా పలువురు మావోయిస్టులు గాయపడినట్లు సమాచారం. ఘటన స్థలం నుంచి మావోయిస్టులు పారిపోగా వారు వదిలివెళ్లిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.