బాలింతను భుజంపై ఎత్తుకుని పెద్దేరువాగు దాటించిన ఘటన.. అక్కడ రోప్ వే బ్రిడ్జి ఏర్పాటుకు సర్కారు నిర్ణయం

బాలింతను అలాగే మోస్తూ పెద్దేరువాగు దాటించారు. దీనిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు.

బాలింతను భుజంపై ఎత్తుకుని పెద్దేరువాగు దాటించిన ఘటన.. అక్కడ రోప్ వే బ్రిడ్జి ఏర్పాటుకు సర్కారు నిర్ణయం

Updated On : October 1, 2024 / 2:51 PM IST

Gummadi Sandhya Rani: అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో ఓ బాలింతను కుటుంబం సభ్యులు ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో భుజంపై మోసుకెళ్లిన ఘటన అందరినీ కలిచి వేసిన విషయం తెలిసిందే.

బాలింతను అలాగే మోస్తూ పెద్దేరువాగు దాటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో సంధ్యారాణి మాట్లాడారు. వాగు దాటేందుకు బాలింతలు పడుతున్న కష్టాలను చూసి సంధ్యారాణి చలించిపోయారు.

బాలింతలు వాగు దాటేందుకు రోప్ వే బ్రిడ్జిని ఏర్పాటు చేసేందుకు ఆమె అనుమతులు మంజూరు చేయించారు. రూ.70 లక్షలతో దాన్ని ఏర్పాటు చేయొచ్చని అధికారులు అంచనా వేశారు. వర్షాలు తగ్గాక త్వరలో రోప్ వే బ్రిడ్జి పనులు ప్రారంభమవుతాయి.

Sree Vishnu : సనాతన ధర్మంపై శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు..